గుడ్ న్యూస్.. మద్యం టెండర్ల గడువు పెంచిన సర్కార్

Mana Enadu : ఏపీలో మద్యం దుకాణాల లైసెన్సుల (Wine Shop License)కు దరఖాస్తులు చేసుకోవాలనుకుంటున్న వారికి ప్రభుత్వ తీపి కబురు చెప్పింది. ఇవాళ్టి (బుధవారం)తో ముగియనున్న దరఖాస్తుల స్వీకరణ గడువును మరో రెండ్రోజులు పొడిగించింది. మొదట జారీచేసిన నోటిఫికేషన్‌ ప్రకారం ఈ గడువు బుధవారం (అక్టోబర్ 9వ తేదీ)తో ముగియాల్సింది. అయితే అర్జీదారుల నుంచి వచ్చిన వినతుల మేరకు ఈ నెల 11వ తేదీ సాయంత్రం వరకు గడువు పెంచుతున్నట్లు ఎక్సైజ్‌ శాఖ (AP Excise Department) ముఖ్యకార్యదర్శి ముకేశ్‌కుమార్‌ మీనా మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.

16న కొత్త దుకాణాలు ప్రారంభం

ఈ నేపథ్యంలో ఈనెల 11వ తేదీకి బదులుగా 14వ తేదీన లాటరీ తీయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. లాటరీ పద్ధతిలో  లైసెన్సులు ఖరారు చేయనున్నట్లు వెల్లడించాయి. ఇక 16వ తేదీ నుంచి కొత్త లైసెన్సుదారులు దుకాణాలు (New Wine Shops in AP) ప్రారంభించుకోవచ్చని సూచించాయి. అదే రోజు నుంచి కొత్త మద్యం విధానం అమల్లోకి వస్తున్న విషయం తెలిసిందే.

రూ.826.96 కోట్ల ఆదాయం 

మొత్తం 3,396 దుకాణాలకు లైసెన్సుల జారీకి నోటిఫికేషన్‌ ఇవ్వగా మంగళవారం రాత్రి 9 గంటల వరకు 41,348 దరఖాస్తులు అందినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. నాన్‌ రిఫండబుల్‌ రుసుముల రూపంలో ప్రభుత్వానికి రూ.826.96 కోట్ల ఆదాయం వచ్చినట్లు వెల్లడించారు. అయితే గడువు పొడిగిస్తున్న నేపథ్యంలో మరిన్ని దరఖాస్తులు (Wine Shop Tender Applications) వచ్చే అవకాశముందని అంచనా వేస్తున్నారు.

మద్యం దుకాణాల లైసెన్సుల కోసం అర్జీ చేసుకునే వారు ఆఫ్‌లైన్‌ విధానంలో నాన్‌ రీఫండ్‌బుల్‌ రుసుములు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు వెసులుబాట్లు కల్పించింది. రూ.2 లక్షల దరఖాస్తు రుసుముకు సంబంధించి దేశంలోని ఏ వాణిజ్య బ్యాంకులో తీసిన డిమాండ్‌ డ్రాఫ్ట్‌ (DD)నైనా అంగీకరిస్తామని తెలిపింది. గ్రామీణ బ్యాంకుల్లో డీడీలు తీస్తే మాత్రం అవి రాష్ట్ర పరిధిలోని బ్యాంకులే అయి ఉండాలని స్పష్టం చేసింది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *