ManaEnadu : ‘రామాయణం’ ఇతిహాసంపై భారతీయ భాషల్లో ఇప్పటికే వందల సినిమాలు తెరకెక్కాయి. అయినా ఇంకా ఇంకా సినిమాలు వస్తూనే ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కో కోణంలో సీతారాముల కథను వెండితెరపై ఆవిష్కరిస్తున్నారు. తాజాగా హిందీలోనూ రామాయణం (Ramayanam)పై చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి అధికారిక అప్డేట్స్ రాలేదు.
రెండు భాగాలుగా రామాయణ
అయితే తాజాగా బాలీవుడ్లో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘రామాయణ (Ramayana)’ చిత్రం గురించి అధికారిక ప్రకటన ఒకటి వెలువడింది. నితేశ్ తివారీ (Nitesh Tiwari) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా రెండు భాగాలుగా రానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ ఓ పోస్టర్ను రివీల్ చేశారు. రామాయణ పార్ట్-1 వచ్చే ఏడాది (2026) దీపావళికి, రెండో భాగాన్ని 2027 దీపావళికి విడుదల చేయనున్నట్లు తెలిపారు.
రామయణ నటులు వీళ్లే!
బాలీవుడ్ అగ్ర నిర్మాతలతో కలిసి అల్లు అరవింద్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను నితీశ్ తివారీ తెరకెక్కిస్తుండగా బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్ (Ranbir Kapoor) రాముడి పాత్రలో కనిపించనున్నాడు. ఇక సీతగా లేడీ సూపర్ స్టార్ సాయి పల్లవి (Sai Pallavi) నటించనుంది. రావణాసురుడి పాత్రలో కేజీయఫ్ ఫేమ్ యశ్ నటించనున్నట్లు కొంతకాలంగా వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. గతంలో ఈ చిత్రం షూటింగ్కు సంబంధించిన కొన్ని ఫొటోలు కూడా లీక్ అయ్యాయి.
MASSIVE DEVELOPMENT… 'RAMAYANA' PART 1 & 2 RELEASE DATE ANNOUNCEMENT… Mark your calendars… #NamitMalhotra's #Ramayana – starring #RanbirKapoor – arrives in *theatres* on #Diwali 2026 and 2027.
Part 1: #Diwali2026
Part 2: #Diwali2027
Directed by #NiteshTiwari. pic.twitter.com/3BRWR0bg2L— taran adarsh (@taran_adarsh) November 6, 2024






