హిట్టు కొట్టు.. గుండు కొట్టించు

ManaEnadu:టాలీవుడ్‌ డైరెక్టర్లకు సంబంధించిన ఒక ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అందులో ముగ్గురు డైరెక్టర్లు ఉండగా అందరిలో ఒక కామన్ పాయింట్ ఉంది. అదే గుండు. అయితే వీరు ముగ్గురూ గుండు కొట్టించుకోవడానికి కారణం ఒకటే కావడం గమనార్హం. అదే ‘బ్లాక్‌బస్టర్’. అవును ఈ ముగ్గురు తమ సినిమా గత సినిమాలతో హిట్టు కొట్టి వెంటనే తిరుమల తిరుపతిలో వేంకటేశ్వరస్వామికి తలనీలాలు అర్పించారు. ఆ తర్వాత దిగిన ఫొటేలే ఇవి. అవే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలా వీళ్లంతా హిట్టు కొట్టి.. గుండు కొట్టించుకొని మొక్కు చెల్లించుకున్నారు. ఇంతకీ ఎవరే సినిమాతో బాక్సాఫీస్ షేక్ చేశారో చూద్దామా?

‘యానిమల్‌’‌తో సందీప్‌రెడ్డి

టాలీవుడ్ ఎమర్జింగ్ డైరెక్టర్‌ సందీప్‌రెడ్డి వంగా బాలీవుడ్‌ హీరో రణ్‌బీర్ కపూర్ హీరోగా తెరకెక్కించిన మూవీ ‘యానిమల్’. ఆ సినిమా ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్ష్ సొంతం చేసుకుంది. సందీప్‌రెడ్డికి అర్జున్‌రెడ్డి రేంజ్‌లో హిట్టు ఇచ్చిందీ మూవీ. అందుకే ఆయన తిరుపతి వెళ్లి బాలాజీకి మొక్కు చెల్లించుకున్నాడు. ఎప్పుడు చూసినా పొడవైన జుట్టు, గుబురు గడ్డం, మీసాలతో కనిపించే సందీప్‌రెడ్డి వంగా సడన్‌గా కొత్త లుక్‌లో కనిపించేసరికి ఫ్యాన్స్ సర్‌ప్రైజ్ అయ్యారు.

‘కల్కి’తో నాగ్

ఈ ఏడాది ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన మూవీ ‘కల్కి’. దాన్ని డైరెక్ట్ చేసిన నాగ్ అశ్విన్ లుక్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సింప్లిసిటీకే సింప్లిసిటీలా ఉంటాడు. ‘కల్కి’తో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్‌కు కూడా హిట్టు ఇచ్చాడు నాగీ. మరి అంత పెద్ద హిట్టు కొట్టాక వేంకటేశ్వరస్వామికి మొక్కు చెల్లించుకోకపోతే ఎలా? పైగా ఆయన తీసింది మైతాలజీ డ్రామా. ఇంకేముంది వెంటనే తిరుపతి బాటపట్టి ఇలా గుండుతో ప్రత్యక్షమయ్యాడు.

‘లక్కీ భాస్కర్’తో వెంకీ అట్లూరి

ప్రస్తుతం థియేటర్లలో నడుస్తున్న సినిమాల్లో పాజిటివ్ టాక్ ఉన్న టాప్3 సినిమాల్లో ‘లక్కీ భాస్కర్’ ఒకటి. అయితే మలయాళ హీరో దుల్కర్ సల్మాన్‌ను పెట్టి తీసిన ఈ మూవీ తెలుగు సినిమాలను తట్టుకొని నిలవడం మామూలు విషయం కాదు. అందుకే ఈ మూవీని రూపొందించిన డైరెక్టర్ వెంకీ అట్లూరి కూడా తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామికి మొక్కుగా గుండు కొట్టించుకున్నాడు. భవిష్యత్తులోనూ ఇలాగే హిట్లు ఇవ్వాలని వారంతా శ్రీవారిని మొక్కుకున్నారు.

 

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *