Kanuma Significance: పాడి పశువుల పండగ.. కనుమ విశిష్ఠత ఇదే

సంక్రాంతి సంబరాలు(Sankranti Celebrations) తొలి రెండు రోజులు అత్యంత సందడిగా జరిగాయి. తొలి రోజు భోగి(Bhogi), రెండో రోజు సంక్రాంతి(Sankranti) పండగను ప్రజలు తమతమ సొంతూళ్లలో సంతోషంగా జరుపుకున్నారు. ఇక ఇవాళ కనుమ(Kanuma) పండగ. ముఖ్యంగా ఈ పండగ రైతన్నలు జరుపుకునే పండుగగా చెప్పుకుంటారు. సంక్రాంతి సంబరంలో చివరి రోజైన కనుమను పశువుల పండుగ అంటారు. పంటలు పండి పంట చేతికొచ్చి సంబరంలో ఉన్న రైతన్న(Farmers)కు ఎంతో గొప్ప నేస్తాలు పశువులు(Cattle). పశువులు సంవత్సరం అంతా తమకు ఎంతో సహాయంగా ఉంటున్నందుకు కృతజ్ఞత చెప్పుకునే పండుగగా ఈ కనుమ లేదా పశువుల పండుగలో అంతరార్థం.

ఈ రోజు తిరుగు ప్రయాణం చేయరు.. ఎందుకంటే

వ్యవసాయం(Agriculture)లో పశువుల ప్రాముఖ్యత చాలా కీలకమైనది. కనుమ పండుగ రోజు ఉదయాన్నే పశువులను శుభ్రంగా కడిగి వాటికి పసుపు కుంకుమ పెట్టి, మెడలో గజ్జెల పట్టీ, కాళ్లకు మువ్వలు వేస్తారు. ఏడాది మొత్తం రైతులకు సహాయపడుతూ ఎండనక, వాననక కష్టపడే పశువులకు ఏడాదిలో ఒక్కసారి కనుమ పండుగ రోజు పూర్తి విశ్రాంతి కల్పిస్తారు. పిండి వంటలతో సంక్రాంతి మంచి విందును ఇస్తే, కనుమ పండుగ మసాలా ఘుమఘుమలతో మైమరపిస్తుంది. ఇక కనుమ రోజు కాకులు కూడా ఎక్కడికీ కదలవని ఓ నానుడి. అందుకే పండక్కి వచ్చిన వారు కనుమ రోజు తిరుగు ప్రయాణం చేయరాదని మన పూర్వీకులు అంటారు. కనీసం ఊరి పొలిమేర కూడా దాటకూడదని అంటారు.

Telangana celebrates festival of cattle 'Kanuma' on third day of Sankranti  festival.

పంటలు సమృద్ధిగా పండాలని..

ఇక కనుమ రోజు గంగిరెద్దుల(Gangireddula) వారు విశేషంగా ఇంటింటికీ తిరుగుతూ గంగిరెద్దు చేత అందరికీ ఆశీర్వాదాలు(Blessings) ఇప్పిస్తూ వారి నుంచి బియ్యం, వస్త్రాలు వంటివి సేకరిస్తారు. కనుమ రోజున రైతులు తమ పొలంలోనే పొంగళ్లు వండి భూలక్ష్మికి నివేదన చేసిన తరువాత ఆ పొంగళ్లను తమ పంట పొలంలో చల్లుతారు. ఆ విధంగా చేయడం వలన కొత్త సంవత్సరం(New Year)లో కూడా పంటలు(Crops) సమృద్ధిగా పండుతాయని విశ్వాసం. ఇక ఈరోజు తెలుగు సంప్రదాయాలలో రథం ముగ్గు(Ratham Muggu) వేయడం చాలా ప్రత్యేకమైన ఆచారం. ఈ ముగ్గు వేయడం వెనుక లోతైన ఆధ్యాత్మిక, సాంస్కృతిక అర్థాలు దాగి ఉన్నాయి. రథం ముగ్గును సూర్య భగవానుడి రథంగా భావిస్తారు. సూర్యుడు(SUN) అన్ని ప్రాణులకు జీవనాధారం. అందుకే ఆయనను ప్రసన్నం చేసుకోవడానికి ఈ ముగ్గును వేస్తారని మహిళల విశ్వాసం.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *