IND vs BAN: గిల్ సూపర్ సెంచరీ.. భారత్ ఈజీ విక్టరీ

ఛాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy) తొలి పోరులో టీమ్ఇండియా(Team India) దుమ్మురేపింది. ఆల్ రౌండ్ ప్రదర్శనతో బంగ్లాను చిత్తు చేసింది. దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచులో బంగ్లాదేశ్‌(Bangladesh)పై 6 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. 229 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్లు రోహిత్(Rohit), గిల్(Gill) శుభారంభం అందించారు. కెప్టెన్ రోహిత్ 41, విరాట్ కోహ్లీ 22, కేఎల్ రాహుల్ 41 రన్స్‌తో రాణించారు. యంగ్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (101) సెంచరీతో చెలరేగాడు. దీంతో భారత్ విజయం సులవైంది. సూపర్ సెంచరీ చేసిన గిల్‌కు “మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్: అవార్డు దక్కింది. కాగా వన్డేల్లో గిల్‌కి ఇది 8వ సెంచరీ కావడం విశేషం.

బంగ్లా బ్యాటర్లలో ఆ ఇద్దరే..

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ భారత్ స్పీడ్ గన్ షమీ(Shami) దెబ్బకు 8.3 ఓవర్లకే 35 రన్స్ చేసి 5 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమంలో తౌహిద్ హృదయ్(Towhid Hridoy) 118 బంతుల్లో 100 పరుగులతో ఆ జట్టును ఆదుకున్నాడు. అతడికి జాకీర్ అలీ(Jakir ALi) 68 రన్స్‌తో సహకారం అందించగా.. మిగతా బ్యాటర్లు అందరూ చేతులెత్తేశారు. దీంతో 49.4 ఓవర్లలో 228 పరుగులకే బంగ్లా ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో మహ్మద్ షమి అద్భుత ప్రదర్శనతో ఐదు వికెట్లు తీసి బంగ్లాదేశ్‌ను కట్టడి చేశాడు. హర్షిత్ రాణా మూడు, అక్షర్ పటేల్ రెండు వికెట్లు పడగొట్టారు.

కాగా భారత్ తన తర్వాతి మ్యాచ్ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌(Pakistan)తో ఫిబ్రవరి 23న తలపడనుండగా.. బంగ్లాదేశ్ 24న న్యూజిలాండ్‌(NZ)తో ఆడనుంది. ఇక ఇవాళ గ్రూప్‌-బిలోని జట్ల సమరం మొదలుకానుంది. అఫ్గానిస్థాన్‌(AFG)తో సౌతాఫ్రికా(SA) తలపడనుంది. కరాచీ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌ మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభమవుతుంది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *