బెట్టింగ్ యాప్స్ ఇష్యూ.. వారిని అరెస్ట్ చేయకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తా: KA పాల్

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్(Betting Apps Issue) వ్యవహారం సంచలనంగా మారింది. ఈ కేసులో ఇప్పటికే పలువురు సినీ ప్రముఖుల(Cine Celebrities)పై కేసు నమోదు కాగా.. నిన్న రామారావు అనే వ్యక్తి నందమూరి బాలకృష్ణ(Balakrishna), ప్రభాస్(Prabhas), గోపీచంద్‌పై ఫిర్యాదు చేశాడు. మరోవైపు ఈ కేసులో సినీ తారలు, క్రికెటర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు నోటీసులు పొందడంతో ప్రజల్లో ఆగ్రహం వెల్లువెత్తుతోంది. తాజాగా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు KA పాల్ ఈ వ్యవహారంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. “72 గంటల గడువు ఇస్తున్నా.. చేసిన తప్పును ఒప్పుకుని, క్షమాపణ చెప్పండి!” అంటూ ఆయన వార్నింగ్ ఇచ్చారు.

ఆ 25 మందిని అరెస్ట్ చేయాలని డిమాండ్

ఇదే సమయంలో కేఏ పాల్ ‘X’ వేదికగా ఓ సంచలన వీడియో విడుదల చేశారు. ఇందులో ఆయన బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన ప్రముఖులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేసు నమోదైన విజయ్ దేవరకొండ, మంచులక్ష్మితో సహా 25 మందిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు, రాజకీయ నేతలు వారి వద్ద డబ్బులు తీసుకొని వదిలేస్తే, తాను వారందరినీ సుప్రీంకోర్టుకు లాగుతానన్నారు. ప్రకాశ్‌రాజ్ లాగా అందరూ బహిరంగ క్షమాపణలు చెప్పాలని పాల్ డిమాండ్ చేశారు.

పోలీసుల ఎదుట హాజరైన యాంకర్ శ్యామల

ఈ కేసులో ఇప్పటికే ప్రముఖ నటులు బాలకృష్ణ, మంచులక్ష్మి, రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, నటి నిధి అగర్వాల్ సహా పలువురిపై కేసులు నమోదయ్యాయి. బిగ్‌బాస్ స్టార్లు, సోషల్ మీడియా ప్రభావశీలులు (ఇన్‌ఫ్లూయెన్సర్లు) కూడా ఇందులో భాగమైనట్లు పోలీసుల విచారణలో స్పష్టమైంది. విచారణను వేగవంతం చేసిన పోలీసులు, ఈ కేసుతో సంబంధం ఉన్న వారందరినీ విచారిస్తున్నారు. ఈ మేరకు ఇవాళ (మార్చి 24) యాంకర్ శ్యామల పంజాగుట్ట పోలీసులు ఎదుట హాజరయ్యారు.

బెట్టింగ్ యాప్స్ కేసులో ఆ యాంకర్‌కు రిలీఫ్, అరెస్ట్ నుంచి హైకోర్టు  మినహాయింపు | Anchor Shyamala Approaches High Court In Betting Apps Case

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Telangana Assembly: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సెషన్స్.. దానిపైనే ప్రధాన చర్చ!

తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు(Telangana Assembly special sessions) నేటి (ఆగస్టు 30) నుంచి మూడు రోజుల పాటు జరగనున్నాయి. ఈ మేరకు ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉభయసభల్లో తొలుత ఇటీవల మరణించిన MLAలు, మాజీ సభ్యులకు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *