DC vs RR: టాస్ నెగ్గిన రాజస్థాన్.. సొంతగడ్డపై క్యాపిటల్స్ సత్తా చాటుతుందా?

ఐపీఎల్ 2025లో భాగంగా 32వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్(DC vs RR) జట్లు తలపడుతున్నాయి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం(Arun Jaitley Stadium)లో జరిగే ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ టాస్ ‌నెగ్గి బౌలింగ్ ఎంచుకుంది. కాగా ఈ మ్యాచులో ఎలాంటి మార్పులు లేవని గత మ్యాచ్ టీమ్‌తోనే బరిలోకి దిగుతున్నట్లు కెప్టెన్ సంజూ శాంసన్(Sanju Samson) టాస్ సమయంలో చెప్పాడు. అటు ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగుతోంది.

సమవుజ్జీల సమరంలో గెలిచేదెవరో..

ఇదిలా ఉండా ప్రతి సీజన్లోనూ IPL పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉండే RR ఈ సారి చతికిలపడింది. 6 మ్యాచ్‌లు ఆడిన రాయల్స్ జట్టు కేవలం రెండు మ్యాచ్‌లలో మాత్రమే విజయం సాధించింది. ఇక DC ఈ సీజన్ ఆరంభం నుంచి అదరగొడుతోంది. 5మ్యాచుల్లో 4 విజయాలు సాధించి సెకండ్ ప్లేస్‌లో కొనసాగుతోంది. ఇక ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ 29 మ్యాచ్‌లలో తలపడ్డాయి. ఇందులో క్యాపిటల్స్ 14 మ్యాచ్‌లలో విజయం సాధించగా, రాజస్థాన్ రాయల్స్ 15 మ్యాచ్‌లలో గెలిచింది. దాదాపు సమవుజ్జీలుగా ఉన్న ఈ జట్లలో నేడు విజయం ఎవరిని వరించనుందో..

తుది జట్లు ఇవే..

రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (w/c), రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, నితీష్ రాణా, వనిందు హసరంగా, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, సందీప్ శర్మ, తుషార్ దేశ్‌పాండే

ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, అభిషేక్ పోరెల్, కరుణ్ నాయర్, కెఎల్ రాహుల్(వికెట్ కీపర్), అక్షర్ పటేల్(కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *