టీమ్ఇండియా(Team India) సీనియర్ బ్యాటర్, ముంబై క్రికెట్ దిగ్గజం అజింక్యా రహానే(Ajinkya Rahane) 2025-26 దేశవాళీ సీజన్ ముందు ముంబై జట్టు కెప్టెన్సీ(Captaincy of the Mumbai team) నుంచి తప్పుకున్నట్లు ప్రకటించాడు. ఈ నిర్ణయాన్ని ఆయన (ఆగస్టు 21) సోషల్ మీడియా(SM) వేదికగా వెల్లడించాడు. జట్టు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, కొత్త నాయకుడిని తయారుచేసేందుకు ఇదే సరైన సమయమని రహానే తెలిపాడు. అయినప్పటికీ, ఆటగాడిగా ముంబై తరపున తన సేవలను కొనసాగిస్తానని, మరిన్ని ట్రోఫీలు సాధించేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశాడు. రహానే సారథ్యంలో ముంబై జట్టు అనేక విజయాలు సాధించింది.

201 ఫస్ట్-క్లాస్ మ్యాచ్లలో 14,000 పైగా పరుగులు
2023-24 సీజన్లో ఏడేళ్ల తర్వాత రంజీ ట్రోఫీ(Ranji Trophy)ని గెలుచుకుంది. అలాగే, 2022-23లో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ(Syed Mushtaq Ali Trophy), 2024-25లో ఇరానీ కప్(Irani Cup)ను కైవసం చేసుకుంది. 18 సంవత్సరాల దేశవాళీ కెరీర్లో 186 మ్యాచ్లు ఆడిన రహానే, 201 ఫస్ట్-క్లాస్ మ్యాచ్లలో 14,000 పైగా పరుగులు సాధించాడు. కెప్టెన్సీ నుంచి తప్పుకున్నప్పటికీ, క్రికెట్కి రిటైర్మెంట్ తీసుకోవడం లేదని, బ్యాటర్గా తన ఆటతీరుతో జట్టుకు సహకరిస్తానని పేర్కొన్నాడు. కాగా ముంబై జట్టుకు కొత్త కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్(Shreyas Ayyar), సూర్యకుమార్ యాదవ్ లేదా యశస్వీ జైస్వాల్లలో ఒకరు బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.
🚨 Breaking News
Ajinkya Rahane has given up the captaincy of the Mumbai Ranji Trophy team ahead of the 2025-26 domestic season, saying he believes “it’s the right time to groom a new leader”. #ranjitrophy #ajinkyarahne pic.twitter.com/U4YAFk8ls5— Cricket Infoo (@cricketinfoo_) August 21, 2025






