Telangana Elections: బీజేపీ-పవన్‌ల పొత్తు ఫిక్స్..సీట్లు ఇవే

తెలంగాణ ఎన్నికల బరిలో చాలా పార్టీలు బరిలో దిగనున్నాయి. ఒకవైపు అధికార బీఆర్ఎస్ నెల రోజు క్రితమే ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో ముందు వరుసలో నిలిచింది. అయితే కాంగ్రెస్ ఒకవైపు అభ్యర్థుల ప్రకటన, మరోవైపు బస్సుయాత్రలు, బహిరంగసభల పేరుతో ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో బీజేపీ ఇప్పటికే రెండు జాబితాలను ప్రకటించింది. మన్నటి వరకూ సీట్ల సర్థుబాటు విషయంలో మీన మేషాలు లెక్కించాయి రెండు పార్టీలు.

తెలంగాణ ఎన్నికల బరిలో చాలా పార్టీలు బరిలో దిగనున్నాయి. ఒకవైపు అధికార బీఆర్ఎస్ నెల రోజు క్రితమే ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో ముందు వరుసలో నిలిచింది. అయితే కాంగ్రెస్ ఒకవైపు అభ్యర్థుల ప్రకటన, మరోవైపు బస్సుయాత్రలు, బహిరంగసభల పేరుతో ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో బీజేపీ ఇప్పటికే రెండు జాబితాలను ప్రకటించింది. మన్నటి వరకూ సీట్ల సర్థుబాటు విషయంలో మీన మేషాలు లెక్కించాయి రెండు పార్టీలు. అయితే తెలంగాణలో బీజేపీ-జనసేన పొత్తు ఎట్టకేలకు ఖరారైంది.

వీరిద్దరి పొత్తులో భాగంగా జనసేనకు 8 లేదా 9 సీట్లు కేటాయించేందుకు సిద్దమైంది కమలం పార్టీ. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జనసేనకు రెండు స్థానాలు కేటాయించేందుకు సిద్దమైంది. కూకట్‌పల్లితో పాటు గ్రేటర్‌లో మరో సీటు జనసేనకు కేటాయించింది. ఇక మిగిలిన అన్ని స్థానాల్లో బీజేపీ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే గతంలో జనసేన నుంచి 30కి పైగా అభ్యర్థులు అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగేందుకు సిద్దంగా ఉన్నప్పటికీ ఇప్పుడు పొత్తులో భాగంగా బీజేపీ కేటాయించిన స్థానాలకే పరిమితమైంది. ఈ ఇరుపార్టీల కెమిస్ట్రీ ఏ మేరకు సత్ఫలితాలు ఇస్తాయో తెలియాలంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వరకూ వేచి చూడక తప్పదు. ఈ ప్రభావం ఏపీ రాజకీయాలపై కూడా చూపుతుందని చెబుతున్నరు రాజకీయ విశ్లేషకులు.

 

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Telangana Assembly: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సెషన్స్.. దానిపైనే ప్రధాన చర్చ!

తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు(Telangana Assembly special sessions) నేటి (ఆగస్టు 30) నుంచి మూడు రోజుల పాటు జరగనున్నాయి. ఈ మేరకు ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉభయసభల్లో తొలుత ఇటీవల మరణించిన MLAలు, మాజీ సభ్యులకు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *