Pushpa2:రిలీజ్ కు ముందే ‘పుష్పరాజ్‌’ రికార్డ్స్.. భారీ ధరకు ఓటీటీ రైట్స్?

ManaEnadu:ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) నటించిన పుష్ప(Pushpa Movie)  మూవీ ఎంతటి ఘన విజయం సాధించిందో.. ఎన్ని రికార్డులు బద్దలు కొట్టిందో తెలిసిందే. ఒక్కసారిగా స్టైలిష్ స్టార్ ను ఐకాన్ స్టార్ గా మార్చేసింది. అప్పటి వరకు తెలుగు, మలయాళంలో మాత్రమే బన్నీకి ఉన్న హవా ఈ సినిమా తర్వాత బాలీవుడ్ వరకూ వెళ్లింది. అలా ఈ టాలీవుడ్ నటుడిని పాన్ ఇండియా స్టార్ ను చేసింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు పార్ట్ -2 ‘పుష్ప2 :ది రూల్‌ (Pushpa2 : The Rule)’ డిసెంబర్ 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ సూపర్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది.అదేంటంటే.. రిలీజ్ కు ముందే పుష్ప సినిమా ఓ క్రేజీ రికార్డు క్రియేట్ చేసిందట. ఈ చిత్రం డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు దక్కించుకుందట. ఇప్పుడు నెట్టింట ఇది హాట్ టాపిక్ గా మారింది. 

దాదాపు రూ.270 కోట్లకు (Pushpa 2 OTT Rights Price) డీల్‌ పూర్తయినట్లు సమాచారం. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ అన్ని భాషల హక్కులను నెట్‌ఫ్లిక్స్‌ దక్కించుకున్నట్లు తెలిసింది. ఇది నిజమైతే భారతీయ ఓటీటీ డీల్స్‌లో ఇదే అతి పెద్దది అని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. బాక్సాఫీస్‌ వద్దకు వచ్చేందుకు ఇప్పటికే పుష్ప రాజ్ కౌంట్‌డౌన్‌ మొదలైన సంగతి తెలిసిందే. 

‘‘మరో వంద రోజుల్లో అతడి రూల్‌ చూడనున్నారు. అద్భుతమైన అనుభూతిని పొందేందుకు సిద్ధంగా ఉండండి’’ అని పుష్ప టీమ్‌ (Pushpa 2 Count Down) ఇటీవల ప్రకటించింది. ఇందులో రష్మిక మందన్న, ఫహద్‌ ఫాజిల్, సునీల్‌, అనసూయ, జగదీశ్‌ ప్రతాప్‌, ధనుంజయ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ మూవీని నిర్మిస్తోంది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *