BIG BREAKING: మహా కుంభమేళాలో అగ్నిప్రమాదం

ప్రపంచంలోనే అతిపెద్ద అధ్యాత్మిక ఉత్సవంగా పేరు గాంచిన మహాకుంభ మేళా(Maha Kumbha Mela)లో మరో ప్రమాదం చోటుచేసుకుంది. యూపీ ప్రయాగ్‌‌రాజ్‌(Prayagraj)లోని మహా కుంభమేళాలో మరోసారి అగ్నిప్రమాదం(Fire Accident) జరిగింది. సెక్టార్-18లోని శంకరాచార్య మార్గ్‌(Shankaracharya Marg)లో టెంట్లు తగలబడి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో ఫైర్ సిబ్బంది(Fire Fighters) మంటలను ఆర్పుతున్నారు.

కాగా జనవరి 30న కూడా సెక్టర్ 22లోని ఛత్నాగ్ ఝాన్సీ ప్రాంతంలో నిర్మించిన టెంట్‌ సిటీలో అగ్నిప్రమాదం జరిగి 18 గుడారాలు అగ్నికి ఆహూతైన సంగతి తెలిసిందే. అంతకుముందు మౌని అమావాస్య(Mauni Amavasya) సందర్భంగా తొక్కిసలాట(Stampede) జరిగి 30 మంది మరణించగా.. పదుల సంఖ్యలో భక్తులు గాయపడ్డారు. కాగా తాజా అగ్ని ప్రమాదంపై యూపీ సీఎం అధికారులతో సమీక్షిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా ఈ మహాకుంభమేళాలో ఇప్పటి వరకు దాదాపు 40 కోట్ల మందికిపైగా పుణ్యస్నానాలు ఆచరించారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *