‘థ్యాంక్యూ మెగాస్టార్’..: కిరణ్‌ అబ్బవరం పోస్ట్‌

Mana Enadu : టాలీవుడ్ యంగ్ నటుడు కిరణ్ అబ్బవరం ఇటీవల ‘క’ (KA Movie)తో సూపర్ సక్సెస్ అందుకున్నాడు. ఫాంటసీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా దీపావళి కానుకగా విడుదలైంది. ఈ చిత్రం ప్రేక్షకుల నుంచే గాక విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా తమకు నచ్చిందని.. క్లైమాక్స్‌ను అస్సలు ఊహించలేకపోయానని ప్రొడ్యూసర్ బన్నీ వాస్‌ ప్రశంసించారు. అల్లు అరవింద్‌, దిల్‌రాజుతోపాటు పలువురు సినీ ప్రముఖులు విజయం పట్ల అభినందనలు తెలిపారు.

క టీమ్ ను కలిసిన చిరంజీవి

మరోవైపు తాజాగా అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) ఈ చిత్రబృందాన్ని ప్రశంసించారు. ఆదివారం తన నివాసంలో క మూవీ టీమ్ ను ప్రత్యేకంగా కలిశారు. సుజీత్‌, సందీప్‌ మేకింగ్‌ స్టైల్‌, నటీనటులను ప్రశంసించారు. ఈ సినిమా గురించి పలు విషయాలపై వారితో మాట్లాడారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ కిరణ్‌ అబ్బవరం తాజాగా ఎక్స్‌ వేదికగా కొన్ని ఫొటోలు షేర్‌ చేసి ఎమోషనల్ మెసేజ్ చేశారు.

థాంక్యూ చిరంజీవి సార్ 

‘‘బాస్‌ నుంచి ప్రశంసలు. దాదాపు గంటపాటు మాకోసం సమయాన్ని కేటాయించి.. ఎన్నో గొప్ప విషయాలు పంచుకున్నందుకు థ్యాంక్యూ చిరంజీవి గారు. ఈ భేటీని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటా. మిమ్మల్ని కలిసిన ప్రతిసారీ నాకెంతో ప్రత్యేకంగా అనిపిస్తుంది’’ అని కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) ఎక్స్ వేదికగా హార్ట్ ఫుల్ మెసేజ్ షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. 

తొలి పాన్ ఇండియా సినిమా

ఇక క అనే సినిమా సంగతికి వస్తే.. సుజీత్, సందీప్ సంయుక్తంగా రూపొందించారు. వాసుదేవ్‌ అనే వ్యక్తి ప్రయాణాన్ని తెలియజేసే విధంగా ‘క’ చిత్రాన్ని తెరకెక్కించారు. 1970 బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించిన ఈ సినిమాలో తన్వీ రామ్‌ (Tanvi Ram) హీరోయిన్‌గా నటించింది. కిరణ్‌ అబ్బవరం నటించిన తొలి పాన్‌ ఇండియా మూవీ ఇదే కావడం గమనార్హం.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *