తెలుగు వారిపై కామెంట్స్.. పరారీలో తమిళ నటి కస్తూరి

Mana Enadu : తమిళ నటి కస్తూరి(Kasthuri) వివాదం రోజురోజుకు ముదురుతోంది. తెలుగు వారిని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన ఆమె పరారీలో ఉన్నట్లు సమాచారం. ఆమె ఫోన్ కూడా స్విచ్ఛాఫ్‌ చేసి.. ఇంటికి తాళం వేసి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఈ కేసులో కస్తూరికి సమన్లు ఇవ్వడం కష్టంగా మారిందని వెల్లడించారు. 

తెలుగు వారిపై అనుచిత వ్యాఖ్యలు

కొద్ది రోజుల క్రితం నటి కస్తూరి ఓ రాజకీయ సభలో తెలుగు వారిని కించపరుస్తూ మాట్లాడిన విషయం తెలిసిందే. ‘తమిళనాడులో అంతఃపుర మహిళలకు సేవ చేసేందుకు తెలుగువారు వచ్చేవారు’ అని ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీంతో తెలుగు సంఘాలు (Telugu Associations) ఆ కామెంట్స్ ను తీవ్రంగా పరిగణించడంతో తన తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు. తాను తెలుగు వారిని కించపరిచే ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేయలేదని  ప్రకటించినా.. ఫలితం లేకుండా పోయింది.

ఫోన్ స్విచ్ఛాఫ్.. ఇంటికి తాళం

మూడు రోజుల క్రితం ఈ వ్యవహారంపై  చెన్నై(Chennai)లో కస్తూరిపై కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే ఆమెకు సమన్లు అందజేసేందుకు పోలీసులు ఇంటికి వెళ్లగా తాళం వేసి ఉంది. ఆమెకు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. దాంతో ఆమె పారిపోయారన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఆమె ఎక్కడుందనే విషయం ఎవరికీ తెలియదు.

తెలుగులో పని చేస్తూ తెలుగు వారిపైనా దుర్భాషలు

ఇక కస్తూరి అన్నమయ్య సినిమాతో తెలుగు ప్రేక్షకుల(Telugu Audience)కు పరిచయమైన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆమె పలు సినిమాల్లో నటించారు. చాలా కాలం తర్వాత ఆమె తెలుగు సీరియల్స్(Telugu Serials) తో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చారు. అలా ఓ తెలుగు సీరియల్ లో లీడ్ రోల్ చేస్తూ తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యారు. ఇలా తెలుగులో ఆఫర్లు పొందుతూ తెలుగు వారినే కించపరడమేంటని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *