సీరియల్ నటీనటులు కూడా సినీ తారల స్థాయిలో ఫాలోయింగ్ సంపాదించుకుంటున్నారు. బుల్లితెరపై పలు సీరియల్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న తారలు, తమ అభినయం, అందంతో ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్నారు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఫోటోలను వీడియోలను షేర్ చేస్తూ తమ ఫాలోవర్స్ ను పెంచుకుంటున్నారు. అలాంటి వారిలో సీరియల్ నటి ఆయేషా ఒకరు.
తెలుగులో సావిత్రమ్మ గారి అబ్బాయి సీరియల్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయేషా, తర్వాత తమిళంలో పలు సీరియల్స్ చేస్తూ కెరీర్ కొనసాగించింది. ఇటీవల జీ తమిళంలో ప్రసారం అయినా సూపర్ క్వీన్ షోలో కూడా పాల్గొంది. ప్రస్తుతం ఆమె తమిళ హీరో విజయ్ ఆంటోనీ నటిస్తున్న లాయర్ అనే సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది.
ఇటీవల ఆయేషా షేర్ చేసిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ప్రైవేట్ జెట్లో కూర్చుని స్టైలిష్గా ఫోటోలకు పోజులిచ్చిన ఆమె ఫోటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. దీంతో “ఆయేషా నిజంగానే ప్రైవేట్ జెట్ కొనుగోలు చేసిందా?” అనే చర్చలు ప్రారంభమయ్యాయి.
View this post on Instagram
ఈ విషయంపై అధికారిక సమాచారం ఏదీ బయటకు రాకపోయినా, కొందరు అభిమానులు ఇది ఆమె సొంత విమానమనే అంటున్నారు. మరికొందరు ఇది ఆమె ఫోటోషూట్ కోసం మాత్రమే ఫోజులిచ్చింది అంటున్నారు. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఆయేషా తరచూ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ అభిమానులను ఎంటర్టైన్ చేస్తుంటుంది.






