Ahmedabad plane crash: అహ్మదాబాద్‌లో కుప్పకూలిన విమానం.. అందులో 242 మంది ప్రయాణికులు

గుజరాత్లోని అహ్మదాబాద్‌లో (Ahmedabad) ఘోర విషాదం జరిగింది. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఎగిరిన ఎయిరిండియా ఏఐ171 విమానం కొద్దిసేపటికే కుప్పకూలింది. అహ్మదాబాద్‌ నుంచి లండన్‌ లోని గాట్విక్‌కు బయల్దేరినట్లు ఆ విమానంలో ఇద్దరు పైలట్లు, 10 మంది సిబ్బందితోపాటు మొత్తం 242 మంది ఉన్నట్లు సమాచారం. ఇందులో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్‌ పౌరులు, ఏడుగురు పోర్చుగల్‌ పౌరులు, ఒకరు కెనడా వాసి ఉన్నట్లు ఎయిరిండియా తెలిపింది. రన్వే పైనుంచి పైకెరిగిన కొద్దిసేపటికే సాంకేతిక లోపంతో కుప్పకూలింది. దీంతో భారీగా మంటలు చెలరేగాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలిస్తున్నారు.

ప్రధాని దిగ్భ్రాంతి..

ప్రమాదంపై ప్రధాని మోదీతోపాటు గుజరాత్‌, బెంగాల్‌, అస్సాం సీఎంలు భూపేంద్ర పటేల్‌, మమతా బెనర్జీ, హిమంత బిశ్వశర్మ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై పౌర విమానయానశాఖ మంత్రి కె.రామ్మోహన్‌ నాయుడితో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. ప్రమాదం వివరాలు అడిగి తెలుసుకున్నారు. అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని, ఎప్పటికప్పుడు వివరాలను తనకు అప్‌డేట్‌ చేయాలని కేంద్రమంత్రికి ఆదేశాలు జారీ చేశారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *