
ప్రస్తుతం సినీఇండస్ట్రీలో అక్కినేని(Akkineni) ఫ్యామిలీకి సంబంధించి ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. టాలీవుడ్ క్రేజీ జంట నాగ చైతన్య(Naga Chaitanya), శోభిత(Shobitha) జంట హాట్ టాపిక్గా మారారు. సమంత నుంచి విడిపోయాక శోభితని వివాహం చేసుకున్న చైతూ ఇప్పుడు ఆమెతో సంతోషంగానే ఉన్నాడు. శోభిత వచ్చినప్పటి నుంచి చైతూ జీవితంలో అంతా మంచే జరుగుతుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. శోభితతో వివాహం తర్వాత నాగ చైతన్య తండేల్(Thandel) వంటి సూపర్ డూపర్ హిట్ దక్కించుకున్నారు.
సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం
ఇక రీసెంట్గా వెకేషన్కి వెళ్లిన శోభిత పెట్ డాగ్ హాష్తో ఆడుకోవడం, తమ సన్ డే ఇలా గడిచిందంటూ పలు ఫొటోలు షేర్ చేయడం చూస్తే వీరిద్దరూ ఎంత అన్యోన్యంగా ఉన్నారో అర్థమవుతుంది. ఇదిలా ఉండగా శోభిత ప్రెగ్నెంట్ అని త్వరలో పండంటి బేబికి జన్మనివ్వబోతుందని, సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం నడుస్తోంది. ఫాన్స్ అయితే అక్కినేని ఫ్యామిలీలోకి వారసుడు రాబోతున్నట్లు SMలో పోస్టులు పెడుతూ హోరెత్తిస్తున్నారు.
Marriage, Blockbuster movie, Now Baby 👌#news3people #NagaChaitanya #shobitha #baby #akkineni pic.twitter.com/cVZ5AbHB0N
— NEWS3PEOPLE (@news3people) April 28, 2025
ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు
దీనిపై నాగచైతన్య నుంచి కానీ శోభిత నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అక్కినేని ఫ్యామిలీ(Akkineni Family) కూడా ఎలాంటి కామెంట్ చేయలేదు. కానీ వార్త మాత్రం నెట్టింట తెగ వైరలవుతోంది. అయితే అక్కినేని ఫ్యామిలీ క్లోజ్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని , శోభిత ప్రెగ్నెంట్ కాదని అంటున్నారు. కాగా చైతూ తండేల్ సక్సెస్ తర్వాత ‘విరూపాక్ష’ ఫేం కార్తిక్ దండు దర్శకత్వంలో మైథలాజికల్ థ్రిల్లర్(NC24) మూవీలో నటిస్తున్నారు.