Alia Bhatt: ఆలియా అసిస్టెంట్​ అంత మోసగత్తా?.. రూ.77లక్షల మోసం కేసులో అరెస్ట్​

బాలీవుడ్‌ బ్యూటీ అలియా భట్‌ (Alia Bhatt) మాజీ పర్సనల్​ అసిస్టెంట్​ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. దాదాపు రూ.77 లక్షల మోసానికి పాల్పడినట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. 2021–2024 మధ్య కాలంలో ఆలియా భట్​కు వేదిక ప్రకాశ్​ శెట్టి అనే యువతి అసిస్టెంట్​గా పనిచేసింది. ఆ సమయంలో అలియా నిర్మాణ సంస్థ ఎటర్నల్‌ సన్‌షైన్‌ ప్రొడక్షన్స్ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో పనిచేసింది. ఆలియాకు నటికి సంబంధించిన ఫైనాన్షియల్‌ డాక్యుమెంట్లు, పేమెంట్స్‌, షెడ్యూల్‌ ప్లానింగ్‌లను చూసుకునేది. ఉద్యోగంలో చేరిన ఏడాది తర్వాత నుంచే ఫేక్​ బిల్స్​ సృష్టించి అలియా సంతకాన్ని మార్ఫింగ్‌ చేసి ఈ మోసానికి పాల్పడింది.

ఫేక్​ బిల్స్​ రూపొందించి..

వేదిక తమను మోసం చేసిందని ఆలియా తల్లి, నటి, దర్శకురాలు సోనీ రజ్దాన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు చీటింగ్‌ కేసు కింద వేదికను అరెస్ట్‌ చేశారు. ఫేక్​ బిల్స్​ రూపొందించి అలియాతో సంతకాలు చేయించి డబ్బును నొక్కేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అలియా సంతకం చేసిన తర్వాత ఈ మొత్తాన్ని తన ఫ్రెండ్స్​ అకౌంట్‌కు పంచుకునేదని, ఆ తర్వాత వినియోగించేదని పోలీసులు తెలిపారు. కొంతకాలంగా పరారీలో ఉన్న వేదిక.. రాజస్థాన్‌, కర్ణాటక, పూణెల్లో తిరిగింది. చివరకు బెంగళూరులో పోలీసులు ఆమెను అరెస్ట్‌ చేసి ముంబయికి తీసుకెళ్లారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *