దుమ్ములేపిన పుష్ప రాజ్.. పార్ట్-2 ట్రైలర్ రిలీజ్

Mana Enadu : తెలుగు ప్రేక్షకులతో పాటు యావత్ భారతీయులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూసిన తరుణం రానే వచ్చింది. పుష్పరాజ్ మరోసారి ఆడియెన్స్ మనసు ఏలేందుకు వచ్చేశాడు. బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపేందుకు పుష్ప పార్ట్-2 త్వరలోనే థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ (Pushpa 2 Trailer) చేశారు.​ బిహార్​ పట్నాలో ఆదివారం (నవంబరు 17న) గ్రాండ్ గా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

పట్నాలో పుష్ప ట్రైలర్ రిలీజ్ ఈవెంట్

పట్నా గాంధీ మైదాన్​లో ఏర్పాటు చేసిన ఈ ఈవెంట్​లో ‘పుష్ప ది రూల్ (Pushpa The Rule)’ ట్రైలర్​ను విడుదల చేశారు. ఈ ఈవెంట్​కు హీరో అల్లు అర్జున్ (Allu Arjuna)- రష్మిక మందన్నాతో పాటు చిత్రబృందం హాజరైంది. పుష్ప రాజ్ ను చూసేందుకు దేశ నలుమూలల నుంచి వేలాది అభిమానులు వచ్చారు.  ఈ ఈవెంట్​కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్​ అవుతున్నాయి.

పార్టీ ఉంది పుష్పా

“ఎవడ్రా వాడు.. డబ్బంటే లెక్కలేదు.. పవర్ అంటే భయం లేదు”.. అంటూ జగపతి బాబు (Jagapatibabu) వాయిస్‌ ఓవర్‌తో ట్రైలర్ షురూ అయింది. ‘పుష్ప.. పేరు చిన్నది.. కానీ సౌండ్‌ మాత్రం చాలా పెద్దది.. పుష్ప అంటే పేరు కారు.. బ్రాండ్’.. అంటూ వచ్చిన డైలాగ్స్ సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేశాయి. ‘పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా.. ఇంటర్నేషనల్‌.. పార్టీ ఉంది పుష్ప’ అంటూ అదిరిపోయే డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ‘శ్రీవల్లి నా పెళ్లాం. పెళ్లాం మాట మొగుడింటే ఎట్టా ఉంటదో ప్రపంచానికి చూపిస్తానంటూ’ పుష్పరాజ్‌ చెప్పిన డైలాగ్ కు లేడీ ఫ్యాన్స్ తెగ ఫ్యాన్స్ అయిపోతున్నారు.

శ్రీలీల స్పెషల్ డ్యాన్స్ 

సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా పాన్ఇండియా లెవెల్​లో డిసెంబర్ 5వ తేదీన గ్రాండ్​గా రిలీజ్ (Pushpa 2 Release Date) అవుతుంది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఫహాద్ ఫాజిల్, అనసూయ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. స్పెషల్ సాంగ్​లో శ్రీలీల (Sreeleela) స్టెప్పులేసింది. ఈ ట్రైలర్ చూస్తుంటే పుష్ప రాజ్ ఈసారి కూడా బాక్సాఫీస్ వద్ద తగ్గేదే లే అంటూ తన హవా చూపించబోతున్నాడని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *