Telugu Doctor Died | ఆస్ట్రేలియాలో కృష్ణాజిల్లా యువతి మృతి

Mana Enadu:  ఇష్టమైన చదువు చదివింది. ఎంబీబీఎస్ పూర్తి చేసి.. నచ్చిన విభాగంలో పీజీ చేసి.. మరింత ఉన్నత స్థానానికి చేరుకోవాలని నిర్ణయించుకుంది. కానీ.. విధికి ఆమెపై కన్ను కుట్టింది. ఆమె కలలను చూసి ఓర్వలేక.. మరణ రూపంలో ఆమె కన్న కలలన్నింటినీ కల్లలుగా మార్చేసింది. ఫ్రెండ్స్ తో ఆనందంగా, సరదాగా గడపానలని ట్రెక్కింగ్ కు వెళ్లడమే ఆమె పాలిట శాపంగా మారింది.

కృష్ణాజిల్లాకు చెందిన వేమూరు ఉజ్వల (23) ఆస్ట్రేలియా గోల్డ్ కోస్ట్ లోని బాండ్ విశ్వవిద్యాలయంలో ఎంబీబీఎస్ పూర్తి చేసి.. ప్రస్తుతం రాయల్ బ్రిస్బేన్ ఉమెన్స్ ఆస్పత్రిలో పనిచేస్తోంది. మార్చి 2న సరదాగా తోటి స్నేహితులతో కలిసి ట్రెక్కింగ్ కు వెళ్లిన ఉజ్వల.. కాలుజారి లోయలో పడి మరణించింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. కూతురి మరణవార్త విన్న తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. కాగా.. ఉజ్వల తల్లిదండ్రులు వేమూరు మైథిలి – వెంకటేశ్వరరావు ఆస్ట్రేలియాలోనే స్థిరపడ్డారు. ఆమె అంత్యక్రియలను మాత్రం స్వగ్రామంలోనే నిర్వహించనున్నారు. శనివారం ఉంగుటూరు మండలం ఎలుకపాడులోని అమ్మమ్మ, తాతయ్యల ఇంటికి ఉజ్వల భౌతిక కాయాన్ని తీసుకురానున్నారు.

 

Related Posts

Bahraich : యూపీని వణికిస్తున్న తోడేళ్లు.. దాడులకు అదే కారణమా?

ManaEnadu:ఉత్తర్‌ప్రదేశ్‌ (Uttar Pradesh) రాష్ట్రాన్ని తోడేళ్లు వణికిస్తున్నాయి. ముఖ్యంగా బహరయిచ్‌ జిల్లాలో తోడేళ్ల దాడులు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. సుమారు 50 గ్రామాల ప్రజలు తోడేళ్ల వల్ల క్షణక్షం భయంతో బతుకుతున్నారు. అయితే ఇలా తోడేళ్లు వరుస దాడులకు…

రేప్ చేస్తే లైఫ్‌టైమ్ జైల్లోనే.. ‘అపరాజిత బిల్లు’కు బంగాల్ అమోదం

ManaEnadu:పశ్చిమ బెంగాల్‌ (West Bengal) కోల్‌కతాలో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన (Kolkata Doctor Rape Murder) దేశవ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో కోల్‌కతా పోలీసులు, ఆ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై పెద్ద…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *