Katepally |అవినీతి లెక్కలు తేలుస్తా..

Mana Enadu: కామారెడ్డి అసెంబ్లీలో ప్రభుత్వ అధికారులు అవినీతికి పాల్పడితే ఊరుకునేది లేదని, అవినీతి రహిత కామారెడ్డిని చూడాలని కోరుకుంటున్నానని కామారెడ్డి(Kamareddy) ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణా రెడ్డి అన్నారు.

ట్విట్టర్ ద్వారా వీడియో విడుదల చేసిన ఆయన అవినీతి అధికారులపై విరుచుకుపడ్డారు. అధికారులు డబ్బులు తీసుకుంటే ఎంతకైనా తెగిస్తానని, అధికారులు నిజాయితీగా ఉంటే కాళ్లు మొక్కుతానని, అదే అవినీతికి పాల్పడిన అధికారులను రోడ్డు మీదికి లాగి బట్టలు విప్పి కొడతానని వార్నింగ్ ఇచ్చారు.

ఇక ఇప్పటినుండి 57 నెలల పాటు యుద్దం చేస్తానని, ధైర్యం, నిజాయితీ ఉన్న కామారెడ్డిలో ఉండాలని, లేకపోతే ట్రాన్స్ ఫర్ పెట్టుకొని వెళ్లిపోవాలని చెప్పారు. తాను డబ్బు, లిక్కర్ పంచకుండా నిజాయితీగా గెలిచి వచ్చానని, అధికారులు కూడా అలాగే ఉండాలని కోరుకుంటానన్నారు. ఇప్పటివరకు అవినీతికి పాల్పడ్డ అధికారులకు సరిదిద్ధుకోవడానికి 100 రోజుల సమయం ఇచ్చానని, తాను అవినీతి రహిత కామారెడ్డి కోసం పని చేస్తానని, అది కాకుండా ఎవరు అడ్డం పడ్డా వాళ్ల అంతు చూస్తానన్నారు. అన్ని డిపార్ట్ మెంట్ ల డాటా తన వద్ద ఉందని, అధికారులు ఇష్టం వచ్చినట్టు డిప్యూటేషన్లు, ట్రాన్స్ ఫర్లు పెట్టుకున్నా ఎవరిని విడిచి పెట్టనని, కామారెడ్డిని సెట్ చేశాక నా టెర్మ్ అయిపోతుందని పేర్కొన్నారు.

Share post:

లేటెస్ట్