
ఏపీలో కొలువుదీరిన కూటమి ప్రభుత్వం తొలిసారిగా పూర్తిస్థాయి వార్షిక పద్దు (AP Budget 2025-26)ను ప్రవేశపెట్టింది. రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) శాసనసభలో, మరో మంత్రి కొల్లు రవీంద్ర శాసనమండలిలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. రూ.3.22 లక్షల కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం వార్షిక పద్దును ప్రవేశపెట్టింది. ఇక రూ.48వేల కోట్లతో ప్రత్యేక వ్యవసాయ పద్దు (Agriculture Budget 2025)ను సమర్పించింది.
శాఖల వారీగా బడ్జెట్ కేటాయింపులు ఇవే..
- మహిళా శిశు సంక్షేమం, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమం కోసం రూ.4,332 కోట్లు
- నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖకు రూ.1,228 కోట్లు
- పాఠశాల విద్యాశాఖకు రూ.31,805 కోట్లు
- ఉన్నత విద్యాశాఖకు రూ.2,506 కోట్లు
- వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమానికి రూ.19,264 కోట్లు
- పంచాయతీరాజ్ శాఖకు రూ.18,847 కోట్లు
- పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు రూ.13,862 కోట్లు
- గృహనిర్మాణ శాఖకు రూ.6,318 కోట్లు
- జలవనరుల శాఖకు రూ.18,019 కోట్లు
- పరిశ్రమలు, వాణిజ్య శాఖకు రూ.3,156 కోట్లు
- ఇంధన శాఖకు రూ.13,600 కోట్లు
- ఆర్అండ్బీకి రూ.8,785 కోట్లు
- యువజన పర్యాటక, సాంస్కృతిక శాఖకు రూ.469 కోట్లు
- గృహ మంత్రిత్వశాఖకు రూ.8,570 కోట్లు
- తెలుగు భాష అభివృద్ధి, ప్రచారం కోసం రూ.10 కోట్లు
- మద్యం, మాదకద్రవ్యాల రహిత రాష్ట్రం కోసం నవోదయ 2.0 కార్యక్రమానికి రూ.10 కోట్లు
- అన్నదాత సుఖీభవ కోసం రూ.6,300 కోట్లు
- పోలవరం కోసం రూ.6,705 కోట్లు
- జల్జీవన్ మిషన్ కోసం రూ.2800 కోట్లు
- ఎస్సీల సంక్షేమానికి రూ.20,281 కోట్లు
- ఎస్టీల సంక్షేమానికి రూ.8,159 కోట్లు
- బీసీల సంక్షేమానికి రూ.47,456 కోట్లు
- అల్పసంఖ్యాక వర్గాల కోసం రూ.5,434 కోట్లు
- తల్లికివందనం కోసం రూ.9,407 కోట్లు
- ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కోసం రూ.27,518 కోట్లు
- ఆర్టీజీఎస్ కోసం రూ.101 కోట్లు
- దీపం 2.0 పథకానికి రూ.2,601 కోట్లు
- మత్స్యకార భరోసాకు రూ.450 కోట్లు
- స్వచ్ఛాంధ్ర కోసం రూ.820 కోట్లు
- డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి రూ.3,486 కోట్లు
- ఆదరణ పథకానికి రూ.1000 కోట్లు
- పీపీపీ ప్రోత్సాహానికి రూ.2 వేల కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు
- రెవెన్యూ వ్యయం అంచనా రూ.2,51,162 కోట్లు
- మూలధన వ్యయం అంచనా రూ.40,635 కోట్లు
- రెవెన్యూ లోటు రూ.33,185 కోట్లు
- ద్రవ్యలోటు రూ.79,926 కోట్లు