ఏపీలో పదో తరగతి పరీక్షా ఫలితాలు(AP 10th Class Results) ఇవాళ ఉదయం (ఏప్రిల్ 23) ఉదయం 10 గంటలకు విడుదల కానున్నాయి. పదో తరగతి పబ్లిక్ పరీక్షలతో పాటు ఓపెన్ స్కూల్ పదో తరగతి(AP Open School 10th Results), ఓపెన్ స్కూల్ ఇంటర్ ఫలితాల(Open School Inter Results)ను సైతం విడుదల చేయనున్నారు. అభ్యర్థులు తమ ఫలితాలను https://bse. ap. gov. in తోపాటు https://apopenschool. ap. gov. in/ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ ఏడాది పబ్లిక్ పరీక్షలకు దాదాపు 6 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కేవీ శ్రీనివాసులు రెడ్డి(KV Srinivasulu Reddy) వెల్లడించారు.

రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి..
కాగా ఈ ఏడాది మార్చి 17 నుంచి మార్చి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా 3,450 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షలు(SSC Board Exams 2025) నిర్వహించారు. మొత్తం 6,19,275 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు, వీరిలో 3,17,939 మంది బాలురు, 3,05,153 మంది బాలికలు ఉన్నారు. విద్యార్థులు SSC బోర్డు వెబ్సైట్తో పాటు “మనమిత్ర(Mana Mitra)” వాట్సాప్ యాప్లోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. కాగా ఏపీలో ఇదివరకే ఇంటర్ పరీక్షలు విడుదలైన విషయం తెలిసిందే.








