Road Accident | అరకు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

మన Enadu: నందివలస గ్రామంలో శుక్రవారం రాత్రి జాతర జరిగింది. ఆ జాతరకు వెళ్లి వస్తుండగా రాత్రి 11గంటల సమయంలో ప్రమాదం జరిగింది.

Araku Valley Accident : అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందగా.. పలువురికి గాయాలయ్యాయి. అరకు లోయ మండలం నందివలసలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అదుపుతప్పి మూడు బైక్ లు ఢీకున్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించగా.. మరికొందరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను అరకు లోయ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం తరలించారు. చికిత్స పొందుతూ మరో వ్యక్తి మరణించాడు.

నందివలస గ్రామంలో శుక్రవారం రాత్రి జాతర జరిగింది. ఆ జాతరకు వెళ్లి వస్తుండగా రాత్రి 11గంటల సమయంలో రెండు బైకులను అరకులోయ నుంచి వెళ్తున్న బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మృతులు చినలబుడు ప్రాంతానికి చెందిన బురిడీ హరి (17), గొల్లూరి అమ్మనాకాంత్‌ (13), లోతేరు ప్రాంతానికి చెందిన త్రినాథ్ (32), భార్గవ్ (4) ఉన్నారు. తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం విశాఖ కేజీహెచ్ కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుల కుటుంబ సభ్యులు, బంధువుల రోధనలతో ఆస్పత్రి ప్రాంతంలో విషాదం నెలకొంది.

Related Posts

Mahakumbh: కుంభమేళా తొక్కిసలాట.. సహాయక చర్యలపై PM మోదీ ఆరా

మహా కుంభమేళా(Mahakumbha Mela) ప్రపంచంలోనే అతిపెద్ద అధ్యాత్మిక కార్యక్రమం. 144 ఏళ్లకు ఒకసారి వచ్చే మహత్తర వేడుక. కోట్లాది మంది తరలివచ్చే బృహత్తర ఆధ్యాత్మిక ఉత్సవం. 45 రోజుల పాటు కొనసాగే ఈ మహా కుంభమేళాకు దేశవిదేశాల నుంచి భక్తులు తరలివస్తున్నారు.…

Mahakumbh 2025: కుంభమేళాలో తొక్కిసలాట.. 17 మందికిపైగా మృతి!

ఉత్తరప్రదేశ్‌(UP)లోని ప్రయాగ్‌రాజ్‌(Prayagraj)లో జరుగుతున్న కుంభమేళా(Mahakumbh)లో విషాదం చోటుచేసుకుంది. మౌని అమావాస్య(Moni Amavasya) సందర్భంగా పెద్దయెత్తున జనం తరలిరావడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. త్రివేణీ సంగమం(Triveni Sangamam) సమీపంలోని సంగం ఘాట్ వద్ద భక్తులు(Devotees) పుణ్యస్నానాలు ఆచరించేందుకు తరలివచ్చేక్రమంలో భారీగా భక్తులు గుమిగూడారు. దీంతో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *