నన్ను మిత్రుడిగానే చూడండి.. శత్రువు గా చూస్తే తట్టుకోలేరు..!

మన ఈనాడు:
నన్ను మిత్రుడిగానే చూడండి.. శత్రువు గా చూస్తే తట్టుకోలేరు అంటూ టీడీపీ నేత పరిటాల శ్రీరామ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. అందరికీ మంచి చేయాలనే మీ ముందుకు వచ్చానని తనను ఓ ఫ్రెండ్ గా చూడాలని అన్నారు.
జిల్లా తాడిమర్రి మండలం నిడిగల్లు బహిరంగ సభలో ధర్మవరం నియోజకవర్గ ఇన్ఛార్జి పరిటాల శ్రీరామ్ పాల్గొని మాట్లాడారు. తాను అందరికీ మంచి చేయాలనే మీ ముందుకు వచ్చానని తనను ఓ ఫ్రెండ్ గా చూడాలని అన్నారు. ఇక్కడ చెట్లు నరికడం చూసి.. తనకు చాలా బాధ కలిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. చెట్లు నరికే ఈ విష సంస్కృతికి ముగింపు పలకాలని పిలుపునిచ్చారు.

అటువంటి విష సంస్కృతికి ముగింపు పలకాలనే ఉద్ధేశ్యంతోనే తాను మొక్కలు పంచడం మొదలు పెట్టానని..తన తండ్రి పరిటాల రవీంద్ర ఇచ్చిన స్ఫూర్తితో ఈ కార్యక్రమం మొదలు పెట్టానని తెలిపారు. అప్పట్లో ప్రత్యర్థులు ఇళ్లు కూల్చివేస్తే.. పరిటాల రవి ఇళ్లు కట్టించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆయన రక్తాన్ని మాత్రమే కాదు ఆయన ఆశయాలను కూడా మేం పంచుకున్నామని వాటిని అమలు చేస్తున్నామని అన్నారు. అందుకే పది చెట్లు నరికితే 100చెట్లు పంచుతా..100నరికితే 1000, వెయ్యి నరికితే 10వేలు పంచుతా..10వేలు నరికితే లక్ష చెట్లు పెంచుతానని అన్నారు.

ఇది ఎన్నికల కోసం అని అనుకోవద్దు..మొక్కలు పంచే కార్యక్రమం చాలా మంచిది. ఇది రాజకీయాల కోసం చేసే కార్యక్రమం కాదని స్పష్టం చేశారు. మొక్కలు పంచే ఈ కార్యక్రమం వెనుక నా తల్లి ప్రోత్సాహం ఉందని తెలిపారు. ఎంపీ రామ్మోహన్ నాయుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎర్రన్నాయుడు తరహాలో పోరాడుతున్నారని అన్నారు. ఈ జిల్లాలో మొక్కలు నాటి చెట్లు పెంచటం అంటే ముందుగా గుర్తొచ్చిది మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు అని అన్నారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *