ఏపీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం.. అసెంబ్లీ నుంచి వెళ్లిపోయిన జగన్‌

ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు (AP Budget Sessions 3035) ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ (AP Governor Speech) ప్రసంగిస్తున్నారు. గవర్నర్‌ ప్రసంగం తర్వాత శాసనసభ, శాసన మండలి వ్యవహారాల సలహా కమిటీలు భేటీ అయి.. సమావేశాలు ఎన్ని రోజుల పాటు నిర్వహించాలనే అంశంపై చర్చిస్తారు. మరోవైపు ఈ నెల 28వ తేదీన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ సభలో  వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. మార్చి 3వ తేదీ నుంచి బడ్జెట్‌ సహా అనేక అంశాలపై చర్చ జరగనుంది.

జగన్ వాకౌట్

గవర్నర్ ప్రసంగం ప్రారంభం కాగానే శాసనసభలో వైఎస్సార్సీపీ (YSRCP) సభ్యులు నినాదాలు చేశారు. వైఎస్సార్సీపీని ప్రతిపక్షంగా గుర్తించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఆ పార్టీ సభ్యులు డిమాండ్ చేశారు. వియ్ వాంట్ జస్టిస్‌ అంటూ నినదించారు. వైఎస్సార్సీపీ సభ్యుల నినాదాల మధ్యే గవర్నర్ ప్రసంగం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ నుంచి మాజీ సీఎం జగన్‌ (YS Jagan Walked Out), వైఎస్సార్సీపీ సభ్యులు బయటకు వెళ్లిపోయారు. సభలో 10 నిమిషాలు నినాదాలు చేసి సభ నుంచి వాకౌట్ చేశారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Telangana Assembly: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సెషన్స్.. దానిపైనే ప్రధాన చర్చ!

తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు(Telangana Assembly special sessions) నేటి (ఆగస్టు 30) నుంచి మూడు రోజుల పాటు జరగనున్నాయి. ఈ మేరకు ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉభయసభల్లో తొలుత ఇటీవల మరణించిన MLAలు, మాజీ సభ్యులకు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *