ఏపీ 2025-26 వార్షికబడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం

ఏపీలో కూటమి ప్రభుత్వం తొలి పూర్తిస్థాయి బడ్జెట్‌ (AP Budget 2025-26)ను ఇవాళ (ఫిబ్రవరి 28వ తేదీ) అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. దాదాపు 3, 24,000 కోట్ల అంచనా వ్యయంతో ఈ పద్దును సమర్పించనుంది. 2025-26 వార్షిక బడ్జెట్ ఆమోదం కోసం ఉదయం 9 గంటలకే అసెంబ్లీలోని సీఎం ఛాంబర్​లో చంద్రబాబు (AP CM Chandrababu Naidu) అధ్యక్షతన కేబినెట్ భేటీ అయింది. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్‌కు ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్‌ ప్రతులు అందించారు.

పద్దుకు కేబినెట్ ఆమోదం

ఈ నేపథ్యంలో భేటీ అయిన రాష్ట్ర మంత్రివర్గం (AP Cabinet) 2025-26 వార్షిక బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. ఇక కాసేపట్లో శాసనసభలో  మంత్రి పయ్యావుల బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. శాసనమండలిలో కొల్లు రవీంద్ర బడ్జెట్‌ ప్రవేశపెడతారు. ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్‌ (Agriculture Budget 2025)ను అసెంబ్లీలో అచ్చెన్నాయుడు, మండలిలో నారాయణ సమర్పిస్తారు. అంతకుముందు బడ్జెట్ ప్రతులతో అమరావతిలోని వెంకటాయపాలేనికి ఆర్థికమంత్రి పయ్యావుల చేరుకున్నారు. అక్కడ వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని దర్శించుకుని.. 2025-26 బడ్జెట్ ప్రతులను శ్రీవారి పాదాల వద్ద ఉంచి ఆశీర్వాదం తీసుకున్నారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *