వివేకా మరణంపై చంద్రబాబు సంచలన కామెంట్స్

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు (YS Viveka Murder Case)పై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కూడా వివేకానంద రెడ్డి గుండెపోటుతో చనిపోయారని అనుకున్నానని.. ఆయన కుమార్తె సునీత పోస్టుమార్టం అడగకపోతే ఆయన అంత్యక్రియలు జరిపించేసి ఉండేవాళ్లని అన్నారు. అలా జరిగితే ఆయనది హత్య అని తేలేది కాదని ఈ సందర్భంగా ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో (AP Assembly Sessions 2025) చంద్రబాబు మాట్లాడారు.

గుండెపోటు.. గొడ్డలి పోటుగా మారింది

ఈ కేసులో సాక్షులుగా ఉన్న వారు అనుమానాస్పదంగా చనిపోయారని సీఎం (CM Chandrababu Naidu) వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు ఈ కేసులో ఆరుగురు చనిపోయారని తెలిపారు. దీనిపై లోతుగా దర్యాప్తు జరగాల్సిందేనని.. గుండెపోటు అని చెప్పిన టీవీలోనే గొడ్డలి పోటని వార్త ఇచ్చారని చంద్రబాబు అన్నారు. ఆ హత్య కేసును వైఎస్సార్సీపీ నేతలు తనకు ముడిపెట్టి దుష్ప్రచారం చేశారని వాపోయారు. హత్యారాజకీయాలు లేకుండా 40 ఏళ్లుగా తాను రాజకీయం చేస్తున్నానని చెప్పుకొచ్చారు.

నేరాలు చేస్తే చూస్తూ ఊరుకోం

“రాజకీయ ముసుగులో నేరాలు చేసి తప్పుకుంటామంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. సాంకేతికతను వినియోగించుకుని శాంతి భద్రతల్ని అదుపులో ఉంచుతాం. ఉదాసీనంగా ఉంటే కొందరు పేట్రేగిపోయే అవకాశం ఉంటుంది. కొందరు భావోద్వేగాలతో ట్రాప్​లో పడుతున్నారు. ఇంకొందరు ప్రేమ పేరుతో అమాయకులను ముగ్గులోకి దింపుతున్నారు. రాజకీయ ముసుగులో హత్యలు, నేరాలు, చేస్తే చూస్తూ ఊరుకోం” అని సీఎం చంద్రబాబు హెచ్చరించారు.

Related Posts

Mufasa:The Lion King: ఓటీటీలోకొచ్చిన ముఫాసా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

హాలీవుడ్(Hollywood) బ్లాక్ బ‌స్ట‌ర్ ‘ముఫాసా: ది లయన్‌ కింగ్ (Mufasa The Lion King)’ డిసెంబర్ 20న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. ‘ది లయన్ కింగ్(he Lion King)’ సినిమాకు ప్రీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రం…

తెలంగాణలో పొలిటికల్ టెన్షన్.. మంత్రి పదవిపై ఆశావహుల ఆశ!

తెలంగాణ(Telangana)లో మంత్రివర్గ విస్తరణ(Cabinet expansion)కు కాంగ్రెస్ హైకమాండ్ నుంచి CM రేవంత్ రెడ్డికి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లే కనిపిస్తోంది. ఈ మేరకు ఉగాది తర్వాత కొత్త మంత్రుల ప్రమాణానికి ముహూర్తం ఫిక్స్ చేసినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈమేరకు ఏప్రిల్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *