థాంకూ పవన్ సార్.. ఆ ఊళ్లో అందరికి చెప్పులు పంపిన డిప్యూటీ సీఎం

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. ఆయన ఈ నెల 7న అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగుడ మండలం పెదపాడులో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అక్కడికి తనకు స్వాగతం పలకడానికి వచ్చిన గిరిజన మహిళకు చెప్పులు లేకుండా రావడం ఆయన గమనించారు. మండుటెండలో తనను కలిసేందుకు వచ్చిన ఆ మహిళను చూసి పవన్ కళ్యాణ్ చలించిపోయారు.

Image

345 మందికి పాదరక్షలు

ఈ క్రమంలో ఆ గిరిజనులకు పవన్ కళ్యాణ్ చెప్పులు (Cheppals) పంపించారు.  ఉపాధి హామీ సిబ్బందితో చెప్పి.. గ్రామంలో మొత్తం ఎంత మంది ఉంటారో ఆరా తీయించి.. వారందరికీ ఏ సైజు చెప్పులు అవసరమో సర్వే చేయమని ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా సర్వే నివేదిక రావడంతో గురువారం రోజున ఆయన కార్యాలయ సిబ్బందితో 345 మందికి పాదరక్షలు పంపారు డిప్యూటీ సీఎం.

Image

థాంక్యూ పవన్ కళ్యాణ్

ఉప ముఖ్యమంత్రి కార్యాలయ (AP Deputy CM Office) సిబ్బంది బోయిపల్లి పవన్‌తోపాటు బృంద సభ్యులు, స్థానిక సర్పంచి వెంకటరావు గురువారం రోజున ఆ గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి అందరికీ చెప్పులు పంపిణీ చేశారు. తమ కష్టం చూసి తమకు పాదరక్షలు పంపించిన డిప్యూటీ సీఎంకు ఆ గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు. తమ గ్రామానికి ఇప్పటి వరకు చాలా మంది రాజకీయ నాయకులు వచ్చారు కానీ తమ సమస్యలు చెప్పుకున్నా పట్టించుకోలేదని.. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం తాము చెప్పకుండానే తమ కష్టాన్ని అర్థం చేసుకున్నారని అన్నారు.

Image

Related Posts

Hyderabad Metro: పెరిగిన హైదరాబాద్ మెట్రో ఛార్జీలు

హైదరాబాద్ మెట్రో రైలు ఛార్జీలు పెరిగాయి. కనీస ఛార్జీ రూ.10 నుంచి రూ.12కి, గరిష్ఠా ఛార్జీ రూ.60 నుంచి రూ.75కు పెంచుతున్నట్లు హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ గురువారం ప్రకటించింది. పెంచిన ధరలు ఈ నెల 17 నుంచి అమలు కానున్నట్లు…

Bellamkonda Srinivas: హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌పై కేసు

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌పై (Bellamkonda Srinivas) కేసు నమోదైంది. రాంగ్ రూట్‌లో కారు నడపడమే కాకుండా ట్రాఫిక్ పోలీస్తో శ్రీనివాస్ దురుసుగా ప్రవర్తించడంతో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు బుక్ అయ్యింది. ఈనెల 13న జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీలోని…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *