AP: నారా బ్రాహ్మణి పాదయాత్రకు TDP అడుగులు

అమరావతి:మాజీ సీఎం చంద్రబాబును వైసీపీ సర్కారు అక్రమంగా అరెస్ట్ చేసి TDP పార్టీ బలం తగ్గించాలని చూస్తే..వందరెట్లు ముందుకు పోతుందని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు.

నారా లోకేష్ ను అరెస్ట్ చేస్తామంటూ వైసీపీ నాయకులు ప్రచారం చేసుకుంటున్నారని అదే జరిగితే AP ప్రజలు చూస్తూ ఊర్కోరని TDP శ్రేణులు విశ్వరూపం చూస్తారని హెచ్చరించారు.

నారా బ్రాహ్మణి పాదయాత్ర చేస్తే తనతో కలిసి రాష్ట్రం అంతా కలిసి నడిచేందుకు సిద్దంగా ఉన్నానని సంచలన వ్యాఖ్యలు చేశారు.  TDP అధికారంలోకి రావడంతోనే రాక్షస పాలన అంతమొందించే అవకాశం ఉంటుందని విమర్శలు చేశారు.

అభివృద్ధి తప్ప అవినీతి మరక ఎరుగని బాబును వైసీపీ అధినేత జగన్ అరెస్ట్ చేసి అధికారంలోకి చేస్తున్న ప్రయత్నాలు ప్రజలు తిప్పి కొడాతరని పేర్కొన్నారు. ప్రజలంతా ఒకవైపు ఉంటే..రక్షాస ఆనందం పడుతున్న దుర్మార్గులు మరోవైపు ఉంటే జనం తిరిగిబడి బుద్ది చెబుతారని అన్నారు.

పోలీసులు పెట్టే అక్రమ కేసులకు భయపడేది లేదన్నారు. రాజకీయాలకు అతీతంగా యువత రెండు తెలుగు రాష్ట్రాల నుంచి IT ఉద్యోగులు మద్దతు ఇస్తున్నారని తెలిపారు.

Share post:

లేటెస్ట్