Bandi Sanjay: అభివృద్ధి.. హిందూత్వ ఎజెండాతో ప్రజల్లోకి.. మరోసారి ఎంపీగా పోటీ రెఢి అయిన బండి సంజయ్

కరీంనగర్ జిల్లాలో మరోసారి ఎన్నికల వేడి రాజుకుంది. అసెంబ్లీ ఎన్నికలు ముగిసి వారం రోజులు గడువక ముందే, ఇక్కడ మాత్రంఎన్నికల మూడ్‌లోకి వెళ్తున్నారు రాజకీయ నేతలు. ముఖ్యంగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ కరీంనగర్‌పై ఫోకస్ పెట్టారు.

భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్.. మరోసారి కరీంనగర్ పార్లమెంటు సభ్యులుగా పోటీ చేయడానికి సన్నద్ధమవుతున్నారు. పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తరువాత ఇక్కడే మకాం వేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా సమావేశాలకు ప్లాన్ చేసుకుంటున్నారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వివిధ నియోజకవర్గాల్లో వచ్చిన ఓట్లను పరిశీలిస్తున్నారు. గత ఎన్నికలతో పోలీస్తే గణనీయంగా ఓటింగ్ శాతం పెరిగింది. దీంతో పాటు ఎలాంటి లోటు పాట్లు లేకుండా జాగ్రత్త పడుతున్నారు. ముఖ్యంగా పని చేసుకుంటూ ముందుకు సాగాలని నిర్ణయం తీసుకున్నారు. కరీంనగర్ అసెంబ్లీ ఎన్నికల్లో సంజయ్ పోటీ చేసి గట్టి పోటీ ఇచ్చారు. స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. మరోసారి లోక్‌సభ బరిలో నిలిచి గెలిచేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.

కరీంనగర్ జిల్లాలో మరోసారి ఎన్నికల వేడి రాజుకుంది. అసెంబ్లీ ఎన్నికలు ముగిసి వారం రోజులు గడువక ముందే, ఇక్కడ మాత్రంఎన్నికల మూడ్‌లోకి వెళ్తున్నారు రాజకీయ నేతలు. ముఖ్యంగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ కరీంనగర్‌పై ఫోకస్ పెట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన ఓటమి చవి చూశారు. ఆయన దాదాపు 3 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఓటమి పాలయ్యారు. అయితే అనుహ్యంగా తరువాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో విజయం. సాధించారు. ఈనేపథ్యంలోనే ప్రస్తుతం మరోసారి ఎంపీగా పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన తరువాత కరీంనగర్‌లో ముఖ్య నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు బండి సంజయ్. ఎవరూ ఆదైర్యపడవద్దని సూచిస్తున్నారు. ఎంపీగా మరోసారి పోటీ చేస్తున్నానని, కష్టపడి పార్టీ విజయం కోసం పని చేయాలని కార్యకర్తలకు కోరారు. కరీంనగర్‌లో ఓడిపోయిన 89 వేలకు పైగా ఓట్లు వచ్చాయి. అంతేకాకుండా కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో హుస్నాబాద్ మినహా, మిగతా ఆరు నియోజకవర్గాల్లో ఓటింగ్ శాతం పెరిగింది. కరీంనగర్ తో పాటు హుజురాబాద్లో రెండవ స్థానంలో నిలిచింది భారతీయ జనతా పార్టీ. ఈసారి ఓటింగ్ శాతం పెరగడంతో పాటు క్యాడర్ కూడా పెరిగింది. దీంతోమరోసారి గెలిచేందుకు సన్నద్ధమవుతున్నారు.

అయినప్పటికీ బండి సంజయ్ కుమార్ మరోసారి టికెట్ నాదే, విజయం నాదే అన్న ధీమాలో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధితో పాటు హిందూత్వ ఎజెండాను నమ్ముకుని, మరోసారి బరిలోకి దిగుతున్నారు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా హిందూత్వ సెంటిమెంట్ పని చేసిందని, అందుచేత ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు.. హిందూత్వ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు బండి సంజయ్. అంతేకాదు, ఈసారి సంజయ్ గెలిస్తే, కేంద్ర మంత్రి పదవి వస్తుందనే ప్రచారం కూడా జరుగుతుంది. మూడవ సారి ఖచ్చితంగా మోదీ ప్రభుత్వం వస్తుందనే ధీమాతో ఉన్నారు బీజేపీ శ్రేణులు.

Related Posts

మహిళలకు బంపర్ ఆఫర్.. ఎవరు గెలిచినా నెలకు రూ.2,500

మరికొన్ని రోజుల్లో దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు (Delhi Assembly Elections 2025) జరగనున్నాయి. ఈసారి ఎన్నికల్లో మహిళా ఓటర్లు కీలకంగా మారారు. వారు మొగ్గు చూపే రాజకీయ పార్టీకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో పలు…

రేవంత్.. నువ్వు మగాడివి అయితే నీ జూబ్లీహిల్స్ ప్యాలెస్‌లో చర్చ పెట్టు: KTR

తెలంగాణలో ప్రస్తుతం చర్చంతా బీఆర్‌ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఫార్ముల ఈ రేస్ కేసు(Formula E race case)పైనే నడుస్తోంది. ఫార్ములా ఈ-రేస్‌ వ్యవహారంలో మంగళవారం గంటగంటకూ వ్యవహారం మలుపులు తిరిగిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఇష్యూపై KTR మీడియాతో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *