Bird Flu: బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్.. అమెరికాలో గుడ్ల ధరలకు రెక్కలు!

ప్రస్తుతం తెలుగురాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ(Bird Flu) ఎఫెక్ట్ కొనసాగుతోంది. ముఖ్యంగా ఈ వైరస్ ప్రభావం ఏపీ(Andhra Pradesh)లో ఎక్కువగా ప్రభావం చూపుతోంది. వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత(Chickens die) పడుతున్నాయి. దీంతో చికెన్ షాపులూ మూతపడుతున్నాయి. అటు కోడిగుడ్లను కూడా ప్రజలు తినడానికి భయపడుతున్నారు. దీంతో చికెన్(Chicken), గుడ్ల(Eggs) అమ్మకాలు అమాంతం పడిపోయాయి. అయితే ఈ బర్డ్ ఫ్లూ కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికా(America)కు కూడా పాకింది. అయితే అది తినడం వల్లే భయం కాదు.. తినడం కోసం పెరిగిన భయం.. ఇంతకీ బర్డ్ ఫ్లూకి, అమెరికాకి సంబంధం ఏంటని అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చదవాల్సిందే.

గుడ్లకు అమెరికాలో డిమాండ్

బర్డ్ ప్లూ వల్ల కోళ్లు, గుడ్ల ఉత్పత్తి దారుణంగా పడిపోయింది. దీంతో అమెరికా(USA)లో కోడిగుడ్ల ధరలు రోజురోజుకూ కొండెక్కుతున్నాయి. అమెరికాకు గుడ్లను ఎక్కువగా AP నుంచి ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఎగుమతి చేస్తుంటారు. ముఖ్యంగా యూఎస్‌లో గుడ్లను ప్రోటీన్లు(Protiens) అందించే ఆహారంగా అక్కడి ప్రజలు భావిస్తారు. దీంతో అక్కడ గుడ్లకు భారీగా డిమాండ్‌ ఉంటుంది. ఇక, బర్డ్‌ఫ్లూ దెబ్బకి గుడ్లు ట్టే కోళ్లు క్రమంగా చనిపోతుండడంతో వాటి సంఖ్య గణనీయంగా తగ్గింది.

యూఎస్‌లో గుడ్డుప్రియుల ఆందోళన

ఈ కారణంతో గుడ్ల ఉత్పత్తి ఒక్కసారిగా పడిపోవడంతో.. దాని ప్రభావం కోడి గుడ్ల ధరలపై పడింది. దీంతో అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో డజను గుడ్ల ధర ఏకంగా 10 డాలర్లు (రూ.867)కు చేరిందంటే ప్రస్తుతం అక్కడి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే, గత ఏడాది జనవరి నుంచి USలో కోడి గుడ్ల ధరలు పెరుగుతున్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు డజను గుడ్ల ధర ఏకంగా 65% మేర పెరిగిందట. దీంతో గుడ్డు ప్రియులు ఆందోళన చెందుతున్నారని అక్కడి వార్తా పత్రికలు పేర్కొన్నాయి.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *