Ramayana: బాబోయ్.. ‘రామాయణ’ కోసం రణ్‌బీర్‌కు అంత చెల్లించారా?

బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న చిత్రం ‘రామాయణ(Ramayana)’ గురించి కొత్త విశేషాలు వెలుగులోకి వచ్చాయి. నితీశ్ తివారీ(Nitesh Tiwari) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ రెండు భాగాల మహాకావ్య చిత్రంలో రణ్‌బీర్ కపూర్(Ranbir Kapoor) శ్రీరాముడిగా, సాయి పల్లవి(Sai Pallavi) సీతగా నటిస్తున్నారు. ఈ చిత్రం రూ.1600 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతోంది. తొలి భాగానికి రూ.900 కోట్లు, రెండో భాగానికి రూ.700 కోట్లు కేటాయించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత ఖరీదైన చిత్రంగా ‘రామాయణ’ నిలవనుంది.

ఒక్కో భాగానికి రూ.75 కోట్లు?

తాజా సమాచారం ప్రకారం.. రెండు పార్టులుగా తెరకెక్కనున్న ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడి పాత్ర కోసం ఏకంగా రూ.150 కోట్ల పారితోషికం(Remunaration) అందుకుంటున్నారట. ఒక్కో పార్టుకు రూ.75 కోట్ల చొప్పున ఈ రెమ్యూనరేషన్ ఉంటుందని ఫిల్మ్‌ఫేర్ నివేదిక(Filmfare Report) పేర్కొంది. మరోవైపు, సీత పాత్రలో నటిస్తున్న సాయి పల్లవి ఒక్కో భాగానికి రూ.6 కోట్ల చొప్పున మొత్తం రూ.12 కోట్లు ఛార్జ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రెమ్యూనరేషన్ ఆమె సాధారణ ఫీజు కంటే రెట్టింపుగా ఉందని సమాచారం.
Ramayana: మొదటి పార్ట్ 2026 దివాళికి.. రెండో భాగం 2027 దివాళికి.! రామాయణ అప్డేట్.. - Telugu News | Official Shooting Update on Ranbir Kapoor and Sai Pallavi Ramayana, Details Here | TV9 Telugu
ప్రపంచవ్యాప్తంగా అభిమానులను ఆకట్టుకునేలా..

కాగా ఈ చిత్రంలో యష్(Yash) రావణుడిగా, సన్నీ డియోల్(Sunny Deol) హనుమంతుడిగా, రవి దూబే లక్ష్మణుడిగా నటిస్తున్నారు. హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్, హన్స్ జిమ్మర్, ఏఆర్ రెహమాన్(AR Rehman) సంగీతంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులను ఆకట్టుకునేలా రూపొందుతోంది. మొదటి భాగం 2026 దీపావళికి, రెండో భాగం 2027 దీపావళికి విడుదల కానుంది. ఈ చిత్రం భారతీయ సినిమా సరిహద్దులను మరింత విస్తరించనుందని అభిమానులు(Fans) ఆశిస్తున్నారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *