నేడు బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ భేటీ.. ఫాంహౌస్ నుంచి పిలుపు

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) ఇవాళ పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. నేతలందరికీ ఫాంహౌస్‌కు రావాల్సిందిగా కేసీఆర్‌ పిలుపునిచ్చారు. తాజా రాజకీయ పరిణామాలపై ఇవాళ్టి భేటీలో చర్చించనున్నట్లు సమాచారం. అలాగే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై చర్చించనున్నట్లు తెలిసింది. ఇవాళ్టి భేటీలో కేసీఆర్.. అసెంబ్లీ సమావేశాల్లో (Telangana Assembly Sessions 2025) అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయనున్నారు.

ఏప్రిల్ 27న BRS బహిరంగ సభ

మరోవైపు ఏప్రిల్‌ 27వ తేదీన బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవం (BRS Formation Day) నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో గులాబీ శ్రేణులు భారీ బహిరంగసభ నిర్వహించాలని ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఈ క్రమంలో ఏప్రిల్‌ 10వ తేదీన హైదరాబాద్‌లో BRS ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేయనున్నారు. సిల్వర్‌ జూబ్లీ పేరుతో హైదరాబాద్‌ లేదా.. వరంగల్‌లో బహిరంగ సభకు ప్రణాళికలు చేస్తున్నారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Telangana Assembly: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సెషన్స్.. దానిపైనే ప్రధాన చర్చ!

తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు(Telangana Assembly special sessions) నేటి (ఆగస్టు 30) నుంచి మూడు రోజుల పాటు జరగనున్నాయి. ఈ మేరకు ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉభయసభల్లో తొలుత ఇటీవల మరణించిన MLAలు, మాజీ సభ్యులకు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *