SLBC టన్నెల్​లోకి ‘క్యాడవర్​ డాగ్స్’.. ఇప్పటికైనా ఆచూకీ దొరికేనా?

ఎస్​ఎల్​బీసీ టన్నెల్​(SLBC Tunnel Collapse)లో చిక్కుకున్న 8 మంది కార్మికుల కోసం రెస్క్యూ బృందాలు ఇంకా శ్రమిస్తున్నాయి. వారి ఆచూకీ కోసం సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి.  రెస్క్యూ ఆపరేషన్​ చేపట్టి నేటితో 14 రోజులు పూర్తవుతోంది. రెండు వారాలైనా అందులో చిక్కుకున్న వారి జాడ కానరాలేదు. అయితే వారి ఆచూకీ కనుగొనేందుకు రెస్క్యూ టీమ్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.

టన్నెల్​లోకి క్యాడవర్ డాగ్స్

కేరళ నుంచి క్యాడవర్​ డాగ్స్​ (cadaver dogs) బృందాన్ని రప్పించి వాటిని టన్నెల్​లోకి తీసుకెళ్లింది. తవ్వేందుకు అవసరమైన సామగ్రిని లోకోమోటర్ తో పంపి, వాటితోపాటు 110 మంది సిబ్బంది లోనికి వెళ్లారు. 15 ఫీట్ల లోపల ఉన్నా గుర్తించగల సామర్థ్యత క్యాడవర్​ డాగ్స్ ది. ఈ నేపథ్యంలోనే రెస్క్యూ టీమ్ వాటిని రంగంలోకి దింపింది.

రెస్క్యూలో పురోగతి లేదు

అయితే అన్వేషణ అనంతరం క్యాడవర్ డాగ్స్ బృందం మధ్యాహ్నం టన్నెల్​ నుంచి తిరిగి వెనక్కి వస్తుంది. ఈ రెస్క్యూ ఆపరేషన్ ను, ఘటనా స్థలిలో పరిస్థితులను నాగర్​కర్నూల్​ జిల్లా కలెక్టర్ సంతోష్​ పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికైతే చిక్కుకున్న వారి ఆచూకీ విషయంలో ఎలాంటి పురోగతి లేదని ఆయన తెలిపారు. వీలైనంత త్వరగా వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *