CM Revanth : ‘చర్లపల్లి రైల్వే టెర్మినల్‌కు పొట్టి శ్రీరాములు పేరు’

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly Sessions) కొనసాగుతున్నాయి. ఇవాళ్టి సమావేశాల్లో శాసనసభలో ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్‌ (BC Reservation Bill), తెలుగు వర్సిటీ పేరు మార్పు తదితర బిల్లులు ప్రవేశపెట్టారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. తెలుగు రాష్ట్రాల్లో ఒకే పేరుపై యూనివర్సిటీలు, సంస్థలు ఉండటం వల్ల పరిపాలనా పరమైన సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశముందని సీఎం (CM Revanth Reddy) అన్నారు. దానికి పరిష్కారంగా రాష్ట్రంలోని యూనివర్సిటీలు, సంస్థలకు తెలంగాణకు సంబంధించిన పేర్లు పెడుతున్నట్లు తెలిపారు.

తెలుగు వర్సిటీకి సురవరం ప్రతాప్‌రెడ్డి పేరు

అలాగే చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ (Cherlapally Railway Terminal)కు పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదిస్తున్నట్లు అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి ప్రకటించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో అనేక యూనివర్సిటీలకు పేర్లు మార్చుకున్నట్లు గుర్తి చేసిన ఆయన.. ఈ క్రమంలోనే పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీకి సురవరం ప్రతాప్‌రెడ్డి (Suravaram Pratap Reddy) పేరు పెడుతున్నట్లు చెప్పారు.  పొట్టి శ్రీరాములు వర్సిటీ పేరు మార్చడం ఎవరికీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు.

Image

నేచర్‌ క్యూర్‌ ఆస్పత్రికి రోశయ్య పేరు

చర్లపల్లి రైల్వే టెర్మినల్‌కు పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి (Kishan Reddy), బండి సంజయ్‌ (Bandi Sanjay)కు లేఖ రాస్తానని ముఖ్యమంత్రి తెలిపారు. ఇలా ఆయన మనకోసం ఆయన చేసిన త్యాగాలను గుర్తు చేసుకుందామని చెప్పారు.  మరోవైపు  సుదీర్ఘ అనుభవం గల నేత. గవర్నర్‌గా, సీఎంగా ఎన్నో సేవలందించిన మాజీ ముఖ్యమంత్రి రోశయ్య (Former CM Roshaiah) పేరును బల్కంపేట్‌లో నేచర్‌ క్యూర్‌ ఆస్పత్రికి పెట్టనున్నట్లు వెల్లడించారు. ఆ ఆస్పత్రి సమీపంలో రోశయ్య విగ్రహం నెలకొల్పి అధికారికంగా జయంతి, వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రకటించారు.

Related Posts

ఉగ్రదాడి వేళ మంచి మనసు చాటుకున్న కశ్మీరీలు.. టూరిస్టులకు ఫ్రీగా ఆటో, ట్యాక్సీ రైడ్లు

పహల్గామ్​లో జరిగిన ఉగ్రదాడి (Pahalgam Terror Attack)లో 28 మంది పర్యటకులు మరణించిన విషయం తెలిసిందే. ఈ పెను విషాద సమయంలో అక్కడి ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు, వ్యాపారులు, స్థానికులు మంచి మనసు చాటుకుంటున్నారు. టెర్రర్ అటాక్ వల్ల భయంతో వణికిపోతున్న…

Masooda Ott: మరో ఓటీటీలోకి మసూద.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

అభిమానుల్లో సస్పెన్స్‌తో కూడిన హారర్(Horror) చిత్రాలకు ఎప్పుడూ మంచి ఆదరణ లభిస్తుంటుంది. ఇలాంటి సినిమాల(Movies)ను చూసేందుకు చాలా మంది ఇష్టపడుతుంటారు. ఇలాంటి ఎన్నో సినిమాలు తెలుగు ప్రేక్షకులకు మాంచి థ్రిల్‌(thrill)ని అందించాయి. సరిగ్గా ఇలాంటి థ్రిల్‌నే 2022లో విడుదలైన ‘మసూద(Masooda)’ సినిమా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *