DeepTech Conclave: నాలెడ్జ్ హబ్‌గా ఏపీ.. నేషనల్ డీప్ టెక్ కాంక్లేవ్‌లో చంద్రబాబు

ఏపీని నాలెడ్జ్ హబ్‌(AP Knowledge Hub)గా మారుస్తామని CM చంద్రబాబు వెల్లడించారు. వ్యవసాయంలో టెక్నాలజీ(Technology) ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. IT గురించి ఎవరు మాట్లాడినా హైటెక్ సిటీ(High Tech City)ని ప్రస్తావించకుండా ఉండలేరన్నారు. ఇఫ్పుడు డీప్ టెక్నాలజీ(DeepTech) సరికొత్త ఆవిష్కరణ కానుందని వివరించారు. ప్రపంచంలో నలుగురు IT ప్రొఫెషనల్స్‌లో ఒకరు భారతీయులే ఉన్నారని CM తెలిపారు. ఇవాళ విశాఖలో నేషనల్ డీప్ టెక్ కాంక్లేవ్(DeepTech Conclave in Vizag) నిర్వహించారు. ఈ మేరకు సదస్సును ఆయన ప్రారంభించారు. అనంతరం అధునాతన టెక్నాలజీపై పలువురు నిపుణులతో మాట్లాడారు. 2014- 19 మధ్య AP గ్రోత్ రేట్ 13% ఉందని, ప్రస్తుతం 15% టార్గెట్‌గా పనిచేస్తున్నామని వెల్లడించారు.

పేదరిక నిర్మూలన(Eradication of poverty) ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యత అని చంద్రబాబు అన్నారు. ఉపాధి(employment) కల్పించే వారికి ప్రభుత్వ ప్రోత్సహకాలు ఉంటాయన్నారు. అన్ని రకాల విద్యాసంస్థలు ప్రపంచంతో పోటీపడేలా తీర్చిదిద్దుతామన్నారు. ఫుడ్ సప్లై(Food Supply)కి కూడా AP గ్లోబల్ హబ్‌గా నిలిచిందన్నారు. సదస్సులో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను CM పరిశీలించారు.

ఎక్కడైన చూసినా టెక్నాలజీపైనే చర్చ

ప్రపంచంలో ఎక్కడైనా టెక్నాలజీపైనే చర్చ జరుగుతోందని, టెక్నాలజీలో అనేక కొత్త మార్పులు వస్తున్నాయన్నాయి. ప్రస్తుతం జీవితంలో టెక్నాలజీ ఓ భాగంగా మారిందన్నారు. భారత్‌(India)లో మాత్రమే ఆధార్(Aadhar) ఉందన్నారు. దీని అనుసంధానంతో అన్ని వివరాలు తెలుస్తున్నాయన్నారు. సెల్ ఫోన్(Phone) చేతిలో ఉంటే మనమంత వండర్స్ క్రియేట్ చేయవచ్చనని CM తెలిపారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *