గ్రూప్​-1 నోటిఫికేషన్​ రద్దు కుదరదు.. అభ్యర్థులకు ‘సుప్రీం’ షాక్

Mana Enadu :  తెలంగాణ గ్రూప్-1 అభ్యర్థులకు సుప్రీంకోర్టు (Supreme Court) షాక్ ఇచ్చింది. ఈ పరీక్షల నోటిఫికేషన్ అంశంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఊరటనిస్తూ.. అభ్యర్థులకు షాక్ నిస్తూ తాజాగా తీర్పు వెల్లడించింది. గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ రద్దు కుదరదని తేల్చి చెప్పింది. నోటిఫికేషన్‌ రద్దు, మెయిన్స్‌ వాయిదా వేయాలని కోరుతూ వేసిన పిటిషన్‌ను కొట్టివేసింది.

పిటిషన్లు కొట్టివేత 

గ్రూపు-1 కొత్త నోటిఫికేషన్‌ (Group 1 New Notification) చట్టవిరుద్ధమని, ప్రిలిమ్స్ లో 14 తప్పులున్నాయని.. కొందరు అభ్యర్థులు గతంలో హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే గ్రూప్‌-1 మెయిన్స్‌ వాయిదా వేయాలని హైకోర్టును కోరగా.. ఆ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ వారు సుప్రీంకోర్టు (SC Group 1 Verdict)ను ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై శుక్రవారం రోజున జస్టిస్‌ నరసింహ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపి తీర్పు వెలువరించింది.

మెయిన్స్ కు క్వాలిఫై కాలేదుగా

పిటిషనర్లు మెయిన్స్‌కు క్వాలిఫై కానందున మెయిన్స్‌ పరీక్ష (TG Group 1 Mains) వాయిదా వేయాల్సిన అవసరం లేదు. పరీక్షల నిర్వహణలో కోర్టుల జోక్యం అనవసరం. కోర్టుల జోక్యంతో నియామకాల్లో తీవ్ర జాప్యం జరుగుతుంది. అని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ మేరకు పిటిషన్లు కొట్టివేస్తూ నోటిఫికేషన్ రద్దు, మెయిన్స్ వాయిదా కుదరదని తేల్చి చెప్పింది. 

గ్రూపు-1 మెయిన్స్ కు రంగం సిద్ధం

ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు ధర్మాసనం గ్రూపు-1 మెయిన్స్‌ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇప్పటికే టీజీపీఎస్సీ(TGPSC)  గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఫిబ్రవరిలోగా మెయిన్స్‌ ఫలితాలు విడుదల చేస్తామని టీజీపీఎస్సీ తెలిపింది. అంతే కాకుండా ఇక నుంచి అవరోహణ క్రమంలో అంటే మొదట గ్రూపు-1, గ్రూపు-2 ఆ తర్వాత గ్రూపు-3 పరీక్షల నిర్వహణ, ఫలితాల విడుదల, పోస్టుల భర్తీ ప్రక్రియ చేపడతామని కీలక నిర్ణయం తీసుకుంది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *