దావోస్ పర్యటనలో.. అల్లు అర్జున్‌ అరెస్ట్‌పై సీఎం రేవంత్ కామెంట్స్

గతేడాది డిసెంబరు 4వ తేదీన ‘పుష్ప-2 (Pushpa 2)’ విడుదల సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఓ మహిళ మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ (Allu Arjun) అరెస్టయి ఆ తర్వాత బెయిల్‌పై విడుదలయ్యాడు. తొక్కిసలాట ఘటన, ఆ తర్వాత పరిణామాలు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.

దావోస్ లో సీఎం రేవంత్

ఇక ఈ వ్యవహారంపై తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy) అసెంబ్లీ వేదికగానే తన అభిప్రాయాన్ని ప్రకటించారు. మరోవైపు తాజాగా దావోస్‌ పర్యటన (Davos Tour)లో ఉన్న ఆయన్ను ఆంగ్ల మీడియా ప్రతినిధి అల్లు అర్జున్ అరెస్టు గురించి ప్రశ్నించారు. ఈ క్రమంలో దీనిపై సీఎం రేవంత్‌ రెడ్డి మరోసారి స్పందించారు. తొక్కిసలాట ఘటనకు అల్లు అర్జున్‌ నేరుగా బాధ్యుడు కాదు కదా అని మీడియా ప్రతినిధి ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. దానికి ఆయన ఏం సమాధానం ఇచ్చారంటే..?

రేవంత్ రెడ్డి స్పందన ఇలా

‘‘బెనిఫిట్ షోకు హీరో వస్తారని పర్మిషన్ ఇవ్వమని రెండ్రోజుల ముందు పోలీసుల వద్ద అనుమతి కోసం వస్తే అక్కడి పరిస్థితుల దృష్ట్యా పోలీసులు నిరాకరించారు. అయినా థియేటర్ (Sandhya Theatre Stampede) వద్దకు అల్లు అర్జున్ వెళ్లారు. ఆయన కోసం భారీగా తరలివచ్చిన అభిమానులను ఆయన సెక్యూరిటీ సిబ్బంది తోసేశారు. ఆ క్రమంలో జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మరణించింది. అయితే ఆమె మరణం ఆయన చేతుల్లో లేకపోవచ్చు. కానీ ఒక మహిళ చనిపోతే, 10-12 రోజులు బాధిత కుటుంబాన్ని పట్టించుకోలేదు. అందుకే చట్టం తన పని తాను చేసుకుంటూ పోయింది’’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఘటనపై స్పందించారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Telangana Assembly: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సెషన్స్.. దానిపైనే ప్రధాన చర్చ!

తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు(Telangana Assembly special sessions) నేటి (ఆగస్టు 30) నుంచి మూడు రోజుల పాటు జరగనున్నాయి. ఈ మేరకు ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉభయసభల్లో తొలుత ఇటీవల మరణించిన MLAలు, మాజీ సభ్యులకు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *