Yadagirigutta: యాదగిరిగుట్టలో విమాన స్వర్ణ గోపురాన్ని ఆవిష్కరించిన సీఎం

యాదగిరిగుట్ట ఆలయం(Yadagirigutta Temple)లో దివ్యవిమాన స్వర్ణ గోపుర మహాకుంభాభిషేకం(Divyavimana Swarna Gopura Maha kumbhabhishekam) ఎంతో వైభవంగా జరిగింది. దివ్య విమాన స్వర్ణ గోపుర మహాకుంభాభిషేకంలో సీఎం రేవంత్ దంపతులు పాల్గొన్నారు. ఉదయం 11.54 గంటలకు స్వర్ణగోపురాన్ని సీఎం రేవంత్​ రెడ్డి(CM Revanth Reddy) ఆవిష్కరించారు. ఈ మహా క్రతువులో MP చామల కిరణ్​కుమార్​, ప్రభుత్వ విప్​ బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. భక్తులకు దర్శనమిచ్చిన స్వర్ణగోపురం(Swarna Gopuram). భక్తులు, దాతలు సమర్పించిన విరాళాలతో దేశంలో ఎక్కడా లేని విధంగా 68KGల బంగారంతో గోపురాన్ని స్వర్ణమయంగా మార్చారు. ఇందుకోసం రూ.80 కోట్లకు పైగా ఆలయ అధికారులు ఖర్చు చేసినట్లు వెల్లడించారు.

కాగా మహాక్రతువును తిలకించేందుకు భారీగా భక్తజనం తరలివచ్చారు. CM రావడంతో జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది. కాగా దేశంలో ప్రసిద్ధి చెందిన గంగా, యమునా, గోదావరి, కృష్ణా, తుంగభద్ర, నర్మదా నదీ జలాలతో స్వర్ణ విమాన గోపురానికి మహాసంప్రోక్షణ చేశారు. దీనిపై నృసింహావతారాలు, కేశవ నారాయణ, లక్ష్మీ, గరుడమూర్తుల ఆకారాలు భక్తులకు కనువిందు చేయనున్నాయి.

Image

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *