Yadagirigutta: యాదగిరిగుట్టలో విమాన స్వర్ణ గోపురాన్ని ఆవిష్కరించిన సీఎం

యాదగిరిగుట్ట ఆలయం(Yadagirigutta Temple)లో దివ్యవిమాన స్వర్ణ గోపుర మహాకుంభాభిషేకం(Divyavimana Swarna Gopura Maha kumbhabhishekam) ఎంతో వైభవంగా జరిగింది. దివ్య విమాన స్వర్ణ గోపుర మహాకుంభాభిషేకంలో సీఎం రేవంత్ దంపతులు పాల్గొన్నారు. ఉదయం 11.54 గంటలకు స్వర్ణగోపురాన్ని సీఎం రేవంత్​ రెడ్డి(CM Revanth Reddy) ఆవిష్కరించారు. ఈ మహా క్రతువులో MP చామల కిరణ్​కుమార్​, ప్రభుత్వ విప్​ బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. భక్తులకు దర్శనమిచ్చిన స్వర్ణగోపురం(Swarna Gopuram). భక్తులు, దాతలు సమర్పించిన విరాళాలతో దేశంలో ఎక్కడా లేని విధంగా 68KGల బంగారంతో గోపురాన్ని స్వర్ణమయంగా మార్చారు. ఇందుకోసం రూ.80 కోట్లకు పైగా ఆలయ అధికారులు ఖర్చు చేసినట్లు వెల్లడించారు.

కాగా మహాక్రతువును తిలకించేందుకు భారీగా భక్తజనం తరలివచ్చారు. CM రావడంతో జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది. కాగా దేశంలో ప్రసిద్ధి చెందిన గంగా, యమునా, గోదావరి, కృష్ణా, తుంగభద్ర, నర్మదా నదీ జలాలతో స్వర్ణ విమాన గోపురానికి మహాసంప్రోక్షణ చేశారు. దీనిపై నృసింహావతారాలు, కేశవ నారాయణ, లక్ష్మీ, గరుడమూర్తుల ఆకారాలు భక్తులకు కనువిందు చేయనున్నాయి.

Image

Related Posts

సొంతగడ్డపై సన్‘రైజర్స్’.. రాజస్థాన్‌పై 44 రన్స్‌ తేడాతో గ్రాండ్ విక్టరీ

ఐపీఎల్ రెండో మ్యాచ్‌లో సొంతగడ్డపై సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) అదరగొట్టింది. ఉప్పల్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌(RR)తో జరిగిన మ్యాచులో 44 పరుగుల తేడాతో గ్రాండ్ విజయం సాధించింది. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచులో ఇరు జట్ల బ్యాటర్లు ఫోర్లు, సిక్సర్లతో చెలరేగి…

Sikindar: ‘సికిందర్’ ట్రైలర్ రిలీజ్.. వింటేజ్ లుక్‌లో సల్మాన్‌భాయ్

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్(Salman Khan), ప్రముఖ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్(A.R. Murugadoss) కాంబోలో తెరకెక్కిన మూవీ ‘సికిందర్(Sikindar)’. ఈ మూవీలో సల్మాన్‌కు జోడీగా సక్సెస్‌ఫుల్ హీరోయిన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) నటిస్తోంది. సత్యరాజ్, కాజల్ అగర్వాల్(Kajal Agarwal)…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *