
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కాసేపట్లో BC నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశం హైదరాబాద్లోని ప్రజాభవన్(Praja Bhavan)లో జరగనుంది. ఈ భేటీలో TPCC అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, బీసీ నేతలు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా బీసీ నేతలకు రేవంత్ రెడ్డి స్పష్టమైన మార్గనిర్దేశం చేయనున్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా కులగణన(Caste Census) చేపట్టడం, విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ల అమలుకు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలను నిర్వహించడం, త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు తదితర అంశాల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.
స్పష్టమైన కార్యాచరణ రూపొందిస్తుందా..
కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ వర్గాలకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తుందనే సంకేతాలను బలంగా చాటేందుకు ఈ భేటీ ద్వారా కాంగ్రెస్ నాయకత్వం ఒక స్పష్టమైన కార్యాచరణను రూపొందించనుంది. భేటీలో భాగంగా బీసీ రిజర్వేషన్లు (BC Reservations), ఎస్సీ ఉప కులాల వర్గీకరణ (Classification of SC Sub-castes) చట్టాల కోసం మార్చి 1 నుంచి 5 వరకు అసెంబ్లీ (Assembly) ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో వ్యవహరించాల్సిన తీరుపై చర్చించనున్నారు. ఇక బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంపై ఆ సామాజికవర్గ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) డిస్కస్ చేయనున్నట్లుగా తెలుస్తోంది.