Bridge Collapses: గుజరాత్‌లో వంతెన కూలిన ఘటనలో 10కి చేరిన మృతులు

గుజరాత్‌ రాష్ట్రంలో ఘోర ప్రమాదం(Accident) చోటు చేసుకుంది. వడోదర (Vadodara) జిల్లాలోని మహిసాగర్‌ నది (Mahisagar river)పై ఉన్న గంభీర్‌ వంతెన (Gambhira bridge) బుధవారం ఉదయం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది (Bridge Collapses). ఆ సమయంలో బ్రిడ్జిపై ప్రయాణాలు సాగిస్తున్న నాలుగు వాహనాలు(Foue Vehicles) నదిలో పడిపోయాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం 7:30 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో రెండు ట్రక్కులు, రెండు వ్యాన్లు నదిలో పడిపోయాయి. ఈ ఘటనలో తొలుత ముగ్గురు మరణించగా.. తాజాగా ఆ సంఖ్య 10కి చేరింది. సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. దాదాపు 10 మందిని రక్షించారు. చిక్కుకుపోయిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

కాగా, ఈ వంతెన 45 ఏళ్ల కిందట నిర్మించిందిగా అధికారులు తెలిపారు. చాలా కాలంగా ఇది శిథిలావస్థలో ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. కాగా ఇటీవల గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమానం(Air India Plane Crash) కూలి 269 మంది మరణించిన సంగతి తెలిసిందే.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *