గుజరాత్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం(Accident) చోటు చేసుకుంది. వడోదర (Vadodara) జిల్లాలోని మహిసాగర్ నది (Mahisagar river)పై ఉన్న గంభీర్ వంతెన (Gambhira bridge) బుధవారం ఉదయం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది (Bridge Collapses). ఆ సమయంలో బ్రిడ్జిపై ప్రయాణాలు సాగిస్తున్న నాలుగు వాహనాలు(Foue Vehicles) నదిలో పడిపోయాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం 7:30 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో రెండు ట్రక్కులు, రెండు వ్యాన్లు నదిలో పడిపోయాయి. ఈ ఘటనలో తొలుత ముగ్గురు మరణించగా.. తాజాగా ఆ సంఖ్య 10కి చేరింది. సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. దాదాపు 10 మందిని రక్షించారు. చిక్కుకుపోయిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
#WATCH | Vadodara, Gujarat | The Gambhira bridge on the Mahisagar river, connecting Vadodara and Anand, collapses in Padra; local administration present at the spot. pic.twitter.com/7JlI2PQJJk
— ANI (@ANI) July 9, 2025
కాగా, ఈ వంతెన 45 ఏళ్ల కిందట నిర్మించిందిగా అధికారులు తెలిపారు. చాలా కాలంగా ఇది శిథిలావస్థలో ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. కాగా ఇటీవల గుజరాత్లోని అహ్మదాబాద్లో ఎయిరిండియా విమానం(Air India Plane Crash) కూలి 269 మంది మరణించిన సంగతి తెలిసిందే.






