చందూ మొండేటి (Chandu Mondeti).. కార్తికేయ(Karthikeya) మూవీతో డైరెక్టర్గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. పదేళ్ల క్రితం రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్(Boxoffice) వద్ద సూపర్ హిట్ అందుకోవడంతో చందూకి ఆఫర్స్ క్యూ కట్టాయి. ఆ తర్వాత ఆయన డైరెక్ట్ చేసిన “ప్రేమమ్” మూవీ కూడా మంచి విజయాన్ని దక్కించుకుంది. అయితే ‘సవ్యసాచి’ మాత్రం అనుకున్న రేంజ్లో ఆడలేదు. దీంతో కాస్త స్పీడు తగ్గించిన ఈ యంగ్ డైరెక్టర్ కొంచెం బ్రేక్ ఇచ్చి మళ్లీ నిఖిల్తోనే ‘కార్తికేయ-2’ తెరకెక్కించి మళ్లీ ట్రాక్లో పడ్డాడు చందూ. తాజాగా నాగచైతన్య-సాయి పల్లవి(Naga Chaitanya-Sai Pallavi) జోడీగా ‘తండేల్(Thandel)’ మూవీకి డైరెక్షన్ వహించాడు. ఈ సందర్భంగా నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో చందూ కార్తికేయ-3(Karthikeya-3)పై ఓ అప్డేడ్ రివిల్ చేశాడు.
పెరిగిన బాధ్యతను మర్చిపోలేదు
బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని దక్కించుకుంది కార్తికేయ-2. ఈ నేపథ్యంలో డైరెక్ట్ చందూ ‘కార్తికేయ-3’ గురించి ఓ ఇంటర్వ్యూ(Interview)లో ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఈ చిత్రం చాలా కొత్త అనుభవాన్ని ఇవ్వనుందని. ‘‘కార్తికేయ-3 కోసం ఒక అద్భుతమైన కథ రెడీ చేసుకున్నానని. ‘కార్తికేయ-2’ సక్సెస్ తరువాత పెరిగిన బాధ్యతను తాను మర్చిపోలేదని అన్నారు. ‘కార్తికేయ-2’ ద్వారా కృష్ణ భగవానుడి(Lord Krishna) ఆశీర్వాదం కొత్త జీవితాన్ని, కెరీర్ను ప్రసాదించింది. అందుకు నేను భక్తి పూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ‘కార్తికేయ-3’ కూడా కృష్ణ భగవానుడి కథను ఆధారంగా తీసుకొని సాగుతుంది’’ అని చెప్పాడు చందూ.
పురాణాల ఆధారంగా మరిన్ని కథలు
చందూ మొండేటి మాట్లాడుతూ, ‘‘నేను ఎప్పటి నుంచో కృష్ణుడి గురించి ప్రేక్షకులకు తెలియజేయాలని అనుకుంటున్నాను. ‘కార్తికేయ-2’ ద్వారా అనేక మంది పిల్లలు కూడా కృష్ణుడి గురించి తెలుసుకోవడం నాకు ఎంతో సంతోషం కలిగించింది. ఇకపై నా సినిమాల ద్వారా మన సంస్కృతి, మూలాలు, పురాణాల ఆధారంగా మరిన్ని కథలను చెప్పాలని అనుకుంటున్నట్లు’’ వెల్లడించారు.








