OMC: చంచల్‌గూడ జైలుకి గాలి జనార్దన్ రెడ్డి తరలింపు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన ఓబులాపురం మైనింగ్ కేసు(Obulapuram Mining Case)లో హైదరాబాద్ నాంపల్లి సీబీఐ కోర్టు(CBI Court) ఐదుగురిని దోషులుగా తేలుస్తూ ఈరోజు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఇందులో దోషులైన గాలి జనార్దన్ రెడ్డి (A2), ఆయన పీఏ అలీఖాన్ (A7), వి.డి.రాజగోపాల్ (A3), శ్రీనివాస్ రెడ్డి (A1)ని అధికారులు చంచల్‌గూడ జైలు(Chanchalguda Jail)కు తరలించారు. కోర్టులోనే వైద్యులు వీరికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం కోర్టు నుంచి చంచల్‌గూడ జైలుకు తీసుకెళ్లారు.

Image

 

కోర్టు ఆర్డర్ కాపీ లేటవడంతోనే ఆలస్యం

కాగా కోర్టు ఆర్డర్ కాపీ(Copy of court order) కోసం ఇప్పటి వరకూ వీరంతా కోర్టులోనే ఉండటం గమనార్హం. కోర్టు ఆర్డర్ కాపీ రావడంతో సీబీఐ కోర్ట్ నుంచి నేరుగా చంచలగూడ జైలుకు తరలించారు. దాదాపు 15 ఏళ్ల పాటు సుదీర్ఘ విచారణ అనంతరం ఈ కేసులో మొత్తం ఐదుగురిని దోషులుగా, ఇద్దరిని నిర్దోషులుగా ప్రకటిస్తూ మంగళవారం కోర్టు తుది తీర్పు వెల్లడించింది. ప్రధాన నిందితులకు ఏడేళ్ల జైలుతోపాటు రూ.10 వేల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. అటు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Ex Minister Sabitha Indra Reddy), మాజీ IAS అధికారి కృపానందంకు క్లీన్ చిట్ ఇచ్చింది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *