Gary Kirsten Resign: పాక్ క్రికెట్ ‌జట్టుకు షాక్.. కోచ్ పదవికి కిర్‌స్టన్ గుడ్‌ బై

Mana Enadu: పాకిస్థాన్ క్రికెట్ జట్టు(Pakistan cricket team)కు షాక్ తగిలింది. ఇటీవల వరుస పరాజయాలు చవిచూస్తోన్న ఆ జట్టుకు కోచ్ గ్యారీ కిర్‌స్టన్(Coach Gary Kirsten) ఇకపై ఆ జట్టుతో కొనసాగలేనని స్పష్టం చేశారు. ఆటగాళ్ల మధ్య విభేదాలతోపాటు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(PCB) వైఖరి తనకు నచ్చడం లేదని గ్యారీ పేర్కొన్నారు. కాగా ద‌క్షిణాఫ్రికా(South Africa)కు చెందిన గ్యారీ కిర్‌స్ట‌న్ గురించి టీమ్ఇండియా(Team India) అభిమానుల‌కు స్పెషల్‌గా చెప్పాల్సిన ప‌ని లేదు. 2011లో వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌(2011 ODI World Cup) ధోనీ సేన గెలవడంలో కోచ్‌గా కిర్‌స్ట‌న్ కీల‌క పాత్ర పోషించాడు. కోచ్‌గా ఎంతో ఘ‌నమైన చ‌రిత్ర ఉన్న ఆయ‌న్ని PCB ఏరి కోరి మ‌రి తెచ్చుకుంది. అయితే.. మ‌రో ఆరునెల‌ల ప‌ద‌వీకాలం ఉన్న‌ప్ప‌టికీ అత‌డు కోచ్ పదవికి రాజీనామా ప్రకటించాడు.

 వరుస పరాజయాలే కారణమా..

2024లో పాకిస్థాన్ జట్టుకు ప్రధాన కోచ్‌గా ఎంపికైన కిర్‌స్టన్ నేతృత్వంలోని పాక్ జట్టు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ఐర్లాండ్‌తో టీ20 సిరీస్(T20 series with Ireland) గెలిచిన పాకిస్థాన్.. ఇంగ్లండ్‌తో సిరీస్‌ను కోల్పోయింది. ఆ తర్వాత T20WC 2024లో అమెరికా, భారత్‌లపై ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఇటీవల బంగ్లాదేశ్‌పై టెస్ట్‌ సిరీస్‌(Test series against Bangladesh)లోనూ ఆ జట్టు వైట్ వాష్‌కు గురైంది. దీంతో పాక్ జట్టుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. తాజాగా ఇంగ్లండ్‌తో సిరీస్‌లోనూ తొలి టెస్టు‌లో ఘోర ఓటమి చవిచూసింది. ఇక ఆ జట్టు పని అయిపోయిందంటూ పాక్ అభిమానులు, మాజీ క్రికెటర్లు మండిపడ్డారు.

 జేస‌న్ గిలెస్పీకి కోచ్ బాధ్యతలు

పాక్ వరుస ఓటములకు ఆటగాళ్ల మధ్య సఖ్యత లేదని, PCB సైతం తన డిమాండ్లను ఒప్పుకోకపోవడంతోనే కిర్‌స్టన్ కోచ్ పదవి నుంచి తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు ఆయన రాజీనామాను కూడా PCB వెంట‌నే ఆమోదించ‌డం గ‌మ‌నార్హం. అత‌డి స్థానంలో టెస్టు జ‌ట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా ఉన్న జేస‌న్ గిలెస్పీ(Jason Gillespie)కి అద‌న‌పు బాధ్య‌త‌లు అప్ప‌గించింది. మూడు ఫార్మాట్ల‌కు ప్ర‌స్తుతం గిలెస్పీ కోచ్‌గా కొన‌సాగ‌నున్నాడు. మరో నాలుగు నెలల్లో సొంతగడ్డపై ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy) జరగనున్న వేళ కోచ్ రాజీనామా చేయడం పాకిస్థాన్‌కు గ‌ట్టి ఎదురుదెబ్బ‌గానే చెప్ప‌వ‌చ్చు. కాగా.. బాబ‌ర్ స్థానంలో మ‌హ్మ‌ద్ రిజ్వాన్ ODI, T20 జ‌ట్ల‌కు కెప్టెన్‌గా ప్ర‌క‌టించిన 24 గంట‌ల్లోనే కిర్‌స్ట‌న్ త‌ప్పుకోవ‌డం గ‌మ‌నార్హం.

 

Related Posts

BWF World Championships: సెమీస్‌లో చిరాగ్-సాత్విక్ జోడీ.. సింధుకు తప్పని ఓటమి

పారిస్‌లో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ (BWF World Championships-2025)లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్ రంకిరెడ్డి(Satwiksairaj Rankireddy), చిరాగ్ శెట్టి(Chirag Shetty) జోడీ అద్భుత ప్రదర్శనతో సెమీఫైనల్‌(Semifinals)కు చేరి పతకాన్ని ఖాయం చేసుకుంది.…

PKL- 2025: సాగర తీరంలో కబడ్డీ కూత.. నేటి నుంచి పీకేఎల్ సీజన్ 12 షురూ

క‌బ‌డ్డీ అభిమానులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న Pro Kabaddi League-2025 వ‌చ్చేసింది. ఇప్ప‌టికే విజ‌యవంతంగా 11 సీజ‌న్లు పూర్తి చేసుకుంది. నేటి (ఆగ‌స్టు 29) నుంచి 12వ సీజ‌న్ (PKL 12) ప్రారంభం కానుంది. ఈ సారి మొత్తం 12 జ‌ట్లు టైటిల్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *