
అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) నిర్ణయాలతో అంతర్జాతీయ మార్కెట్లు ఇంకా ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నాయి. మార్కెట్లలో నెలకొంటున్న అనిశ్చితితో బంగారం ధరలకు రెక్కలు వస్తున్నాయి. రోజురోజుకు పసిడి రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి. గత రెండు మూడు రోజుల నుంచి స్వల్పంగా పెరుగుతూ వచ్చిన గోల్డ్ ధర ఇవాళ భారీగా పెరిగి పుత్తడి కొనుగోలు చేయాలనుకున్న వారికి షాక్ ఇచ్చింది. ఇక బంగారంతో పాటే వెండి కూడా భారీగా పెరిగింది.
రూ.1,140 పెరిగిన పసిడి ధర
దేశవ్యాప్తంగా పసిడి ధరలు (Gold Rates Today) గురువారం రోజున భారీగా పెరిగాయి. హైదరాబాద్ మహానగరంలో బుధవారం నాడు రూ.96,170 ఉన్న గోల్డ్ రేటు గురువారం నాటికి రూ.1,140 పెరిగి ప్రస్తుతం రూ.97,310 వద్ద పలుకుతోంది. మరో రెండు మూడు రోజుల్లో పసిడి ధర లక్ష రూపాయలకు చేరుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే ఈ శుభకార్యాల సీజన్ లో చాలా మంది పుత్తడి ఆభరణాలు కొనుగోలు చేసేందుకు ముందుకు రారని అంటున్నారు. ఇక ఈ ధరలు చూసి సామాన్యులు బెంబేలెత్తుతున్నారు.
రూ.2వేలు పెరిగిన సిల్వర్ రేటు
మరోవైపు బంగారానికి ఏ మాత్రం తీసిపోను అంటూ వెండి (Silver Price Today) కూడా పసిడి బాటలోనే పయనిస్తోంది. మొన్నటి వరకు స్వల్పంగా తగ్గుముఖం పట్టి కొన్ని రోజులు స్థిరంగా సాగిన సిల్వర్ రేటు తాజాగా భారీగా పెరిగి షాక్ ఇచ్చింది. హైదరాబాద్ మహానగరంలో కిలో వెండి ధర బుధవారం రోజున రూ.91,938 ఉండగా, గురువారం నాటికి రూ.2,708 పెరిగి ప్రస్తుతం రూ.94,646 వద్ద పలుకుతోంది.