మందుబాబులకు షాక్.. తెలంగాణలో మద్యం ధరలు పెంపు?

మందుబాబులకు తెలంగాణ సర్కార్ (Telangana Govt) బిగ్ షాక్ ఇచ్చింది. త్వరలోనే మద్యం ధరలు పెంచాలని యోచిస్తోంది. ఇటీవల బీర్ ధరలు (Beer Price Hike In Telangana) పెంచిన ప్రభుత్వం లిక్కర రేట్లలో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు. ఇక వేసవిలో మద్యానికి భారీ డిమాండ్ ఉండనుండటంతో వీటి ధరలు పెంచాలని నిర్ణయించినట్లు సమాచారం. అయితే ఎక్కువ మంది తాగే చీప్ లిక్కర్ రేట్లు మాత్రం అలాగే ఉంచాలని.. ధరల పెంపు నుంచి మినహాయింపు ఇవ్వాలని నిర్ణియంచినట్లు తెలిసింది.

వాటిపై 10 శాతం పెంపు

ముఖ్యంగా ఖరీదైన లిక్కర్ ధరలు (Liquor Price Hike) పెంచాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు అధికార వర్గాల సమాచారం. బాటిల్ ధర రూ.500 కంటే ఎక్కువ ఉన్న మద్యం ధర కనీసం 10 శాతం పెంచనున్నట్లు తెలిసింది. ఇక రూ.500 ధర ఉన్న బాటిళ్ల రేటు రూ.50 పెంచే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. లిక్కర్ ఎమ్మార్పీ ధరల ఆధారంగా రేట్లు పెంచాలని నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు.

త్వరలోనే రేట్ల పెంపు

లిక్కర్ రేట్ల (Liquor Rates Hike in Telangana) పెంపు అంశంలో రెండు మూడు విధానాలు అమలు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఏయే విధానంతో ఎంత ఆదాయం వస్తుందో అధికారులు ఓ నివేదిక రూపొందించి త్వరలోనే ప్రభుత్వానికి అందజేయనున్నారు. అనంతరం ఆ నివేదికను పరిశీలించి ఉన్నతాధికారులు, మంత్రులతో సమీక్షించిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మద్యం ధరల పెంపుపై నిర్ణయం తీసుకోనున్నారు.

Related Posts

Hyderabad Metro: పెరిగిన హైదరాబాద్ మెట్రో ఛార్జీలు

హైదరాబాద్ మెట్రో రైలు ఛార్జీలు పెరిగాయి. కనీస ఛార్జీ రూ.10 నుంచి రూ.12కి, గరిష్ఠా ఛార్జీ రూ.60 నుంచి రూ.75కు పెంచుతున్నట్లు హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ గురువారం ప్రకటించింది. పెంచిన ధరలు ఈ నెల 17 నుంచి అమలు కానున్నట్లు…

Bellamkonda Srinivas: హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌పై కేసు

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌పై (Bellamkonda Srinivas) కేసు నమోదైంది. రాంగ్ రూట్‌లో కారు నడపడమే కాకుండా ట్రాఫిక్ పోలీస్తో శ్రీనివాస్ దురుసుగా ప్రవర్తించడంతో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు బుక్ అయ్యింది. ఈనెల 13న జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీలోని…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *