Market Updates: పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన పుత్తడి ధరలు

కొనుగోలుదారులకు బంగారం ధరలు(Gold Rates) మళ్లీ షాకిచ్చాయి. గత మూడు రోజులు తగ్గుతూ వచ్చిన పుత్తడి రేట్లు ఇవాళ భారీగా పెరిగాయి. దీంతో కొనుగోలుదారులు కంగు తిన్నారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడిన పరిమాణాలతో బంగారం ధరల్లో రోజు రోజుకీ మార్పులు చోటు చేసుకుంటున్నాయని మార్కెట్ నిపుణులు(Market Experts) చెబుతున్నారు. దీంతో పసిడి ప్రియులకు కొనుగోలు చేసే విషయంలో కొంచెం గందరగోళం నెలకొంటోందని అంటున్నారు.

 

కాగా బుధవారం (జూన్ 11) హైదరబాద్ బులియన్ మార్కెట్లో గోల్డ్ రేట్లు ఇలా ఉన్నాయి.24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై 820 పెరిగి రూ.98,400కు చేరింది. ఇక 22 క్యారెట్ల పుత్తడి 10 గ్రాములకు రూ.750 పెరిగి రూ. 90,200 వద్ద కొనసాగుతోంది. అటు కేజీ వెండి(Silver)పై రూ.100 పెరిగి రూ.1,19,100గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి. అటు ఒక అమెరిన్ డాలర్‌కు రూపీ వ్యాల్యూ(Rupee Value) రూ. 85.63గా నమోదైంది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *