
ఐపీఎల్(IPL 2025)లో గుజరాత్ టైటాన్స్(GT) దుమ్మురేపింది. ఢిల్లీ నిర్దేశించిన 204 పరుగుల లక్ష్యాన్ని కేవలం 3 వికెట్లు కోల్పోయి 19.2 ఓవర్లలోనే ఛేదించింది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే గుజరాత్ అత్యధిక పరుగులను ఛేదించిన రికార్డును సొంతం చేసుకుంది. ఆ జట్టు ఇప్పటి వరకూ DCపై 204, RCBపై 198,2023లో, RRపై 197, 2024లో, SRHపై 196, 2022లో లక్ష్యాన్ని ఛేదించింది.
204 పరుగుల లక్ష్య ఛేదనలో గుజరాత్ బ్యాటర్ జోస్ బట్లర్(Jos Buttler) సూపర్ ఇన్నింగ్ ఆడాడు. అతడు 54 బంతుల్లో 97 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. అతడికి సాయి సుదర్శన్ 36, రూథర్ఫర్డ్ 43, రాహుల్ తెవాటియా 11 పరుగులతో సహకరించారు. DC బౌలర్లలో ముకేశ్, కుల్దీప్ చెరో వికెట్ తీశారు.
After David or may be better then him
Jos Buttler the greatest overseas batter who’s play IPL #GTvsDC#RRvsLSGpic.twitter.com/RzZNMmxssT— Yash✨ (@Staid_99) April 19, 2025
4 వికెట్లతో చెలరేగిన ప్రసిద్ధ్..
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 203 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆ జట్టులో అభిషేక్ పొరేల్ 18, కరుణ్ నాయర్ 31, కేఎల్ రాహుల్ 28, అక్షర్ 39, స్టబ్స్ 31, అశుతోశ్ 37 పరుగులతో రాణించారు. రాయల్స్ బౌలర్లలో ప్రసిద్ధ్ 4 వికెట్లతో సత్తాచాటాడు. సిరాజ్, అర్షద్, ఇషాంత్, సాయి కిశోర్ తలో వికెట్ పడగొట్టారు. 97 పరుగులతో రాణించిన బట్లర్కు “మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్” అవార్డు దక్కింది. ఈ విజయంతో గుజరాత్ పాయింట్ల పట్టికలో 10 పాయింట్లతో టాప్లోకి వెళ్లింది.