అత్యాచారానికి ప్రతిఘటించిందని ఓ మహిళను తుపాకీతో కాల్చిన ఘటన బిహార్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంగావ్ ఠాణా పరిధిలో నివసిస్తున్న ఓ మహిళ ఇంటికి అర్ధరాత్రి సమయంలో ఆమె సమీప బంధువు, మరో వ్యక్తి వచ్చారు. బలవంతంగా ఆమెను సమీపంలోని చెరువు వద్దకు తీసుకెళ్లి అత్యాచారం చేశారు. బాధితురాలు కేకలు వేయడంతో ఆమెపై కాల్పులు జరిపారు. దీంతో బాధితురాలి కాలికి బుల్లెట్ తగిలింది. వారి నుంచి ఎలాగోలా తప్పించుకున్న మహిళ… కుటుంబసభ్యులకు విషయం చెప్పింది. దీంతో ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించిన అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు.
IMD Report: దేశంలో ప్రకృతి ప్రకోపం.. గత ఏడాది 3200 మంది మృతి
భారత్(India)లో ప్రకృతి వైపరీత్యాలు(Natural Calamities) ఈ మధ్య తీవ్రంగా ప్రతాపం చూపుతున్నాయి. తాజాగా దేశంలో ప్రకృతి వైపరీత్యాల ద్వారా 3200 మంది మరణించారని భారత వాతావరణ వార్షిక నివేదిక(Indian Meteorological Annual Report-2024) పేర్కొంది. ఇందులో అత్యధికంగా పిడుగుల ద్వారా 1374…